Amardeep Big Boss : అమర్దీప్, గీతూ, అశ్వినీ కార్లు ధ్వంసం.. అన్నపూర్ణ స్టూడియో ముందే అరాచకం
బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే ముగిసిపోయింది.ఈ మేరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా, అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. షో ముగిసిన తర్వాత వీరి కోసం అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీగా చేరుకున్నారు. వీరిని కట్టడి చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. కొందరు ఆకతాయిలు స్టూడియో నుంచి బయటకు వస్తున్న'బిగ్ బాస్' కంటెస్టెంట్స్,ఇతర సెలబ్రిటీల కార్లపై రాళ్లు రువ్వారు. చేతికి అందిన వస్తువులతో కార్ల అద్దాలను పగలగొట్టారు.ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్,అమర్దీప్ అభిమానులు ఘర్షణపడ్డారు. ప్రతీసారి అన్నపూర్ణ స్టూడియో బయట గొడవ జరుగుతూనే ఉంటోంది.ఈసారి కూడా ఫ్యాన్స్ రెచ్చిపోయారు. పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ను బూతులు తిట్టారు.ఆ సమయంలో కారులో అమర్ దీప్ తల్లి, భార్య భయబ్రాంతులకు గురయ్యారు.