
Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత!
ఈ వార్తాకథనం ఏంటి
ముంబైలోని వెర్సోవా నుంచి ఒక సంచలన ఘటన వెలుగులోకొచ్చింది. బాలీవుడ్కి చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు మనీష్ గుప్తా తన డ్రైవర్పై కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలొచ్చాయి.
ఈ ఘటనపై వెర్సోవా పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి వెల్లడించారు. ఇద్దరి మధ్య జీతం విషయంలో వివాదం తలెత్తినట్లు తెలిసింది.
దాడికి గురైన డ్రైవర్ రాజిబుల్ ఇస్లాం లష్కర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇదే విషయాన్ని పేర్కొన్నారు.
మూడేళ్లుగా మనీష్ గుప్తా వద్ద డ్రైవర్గా పని చేస్తున్న లష్కర్కు నెలకు రూ.23,000 జీతం వస్తుంది.
కానీ చిత్రనిర్మాత తరచూ జీతం ఆలస్యం చేయడం, ఇటీవల మే 30న ఉద్యోగం నుంచి అకస్మాత్తుగా తొలగించడం వలన లష్కర్ మనస్తాపానికి గురయ్యాడు.
Details
పోలీసులు కేసు నమోదు
తాను అందుకోనిచ్చిన జీతాన్ని ఇవ్వాలని కోరడంతో వాగ్వాదం చెలరేగింది.
ఆ కోపంలో మనీష్ గుప్తా కత్తితో దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటన గురువారం రాత్రి వెర్సోవాలోని సాగర్ సంజోగ్ భవన్లో జరిగినట్లు పోలీసులు తెలిపారు.
దాడి అనంతరం పోలీసులు మనీష్ గుప్తాపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 115(2), 118(2), 352 కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికీ అతను అరెస్టు కాలేదని తెలుస్తోంది.
దాడికి గురైన డ్రైవర్ లష్కర్ తరఫున న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్ ముఖ్ స్పందిస్తూ.. మనీష్ గుప్తాను వెంటనే అరెస్టు చేయాలని, చట్టం ముందు ప్రతీ ఒక్కరూ సమానమేనని గుర్తుచేశారు.
ప్రస్తుతం ఈ ఘటనపై సినీ వర్గాల్లో కలకలం రేగింది.