
Phule Movie : జ్యోతి రావు ఫూలే బయోపిక్కి బ్రేక్.. విడుదలను వాయిదా వేసిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సామాజిక తత్వవేత్త, మహిళల హక్కుల కోసం నిరంతర పోరాటం చేసిన మహాత్మా జ్యోతి రావు ఫూలే (1827-1890), ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలే జీవిత కథల ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం 'ఫూలే (Phule)'.
ఈ సినిమాలో జ్యోతిరావు ఫూలే పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటిస్తుండగా, సావిత్రిబాయి ఫూలే పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ నటిస్తోంది.
ఈ చిత్రానికి అనంత్ నారాయణ్ మహాదేవన్ దర్శకత్వం వహించగా, జీ స్టూడియోస్ సమర్పణలో ప్రణయ్ చోక్షి, జగదీష్ పటేల్, రితేష్ కుదేచా, అనుయా చౌహాన్ కుదేచా, సునీల్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను ఏప్రిల్11న విడుదల చేయనున్నట్టు ప్రకటించినా తాజాగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
Details
ఏప్రిల్ 25న రిలీజ్
బ్రాహ్మణ సంఘాల నుండి వచ్చిన తీవ్ర అభ్యంతరాలు. బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ కులవాదాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆనంద్ దవే సహా పలు సంఘాలు విమర్శించాయి.
సెన్సార్ బోర్డు కూడా సినిమా నుంచి కొన్ని కుల సంబంధిత పదాలను తొలగించాలని సూచించింది.
ఈ ఆరోపణలపై దర్శకుడు అనంత్ మహదేవన్ స్పందిస్తూ, ఈ చిత్రం చారిత్రక వాస్తవాల ఆధారంగా తీసినదే తప్ప ఎలాంటి అజెండా లేదని స్పష్టం చేశారు.
జ్యోతిరావు ఫూలే వర్ణవ్యవస్థ, లింగ వివక్షకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం చేపట్టిన ఉద్యమాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.