Page Loader
Chiranjeevi: 'నా తమ్ముణ్ణి గెలిపించండి'.. సోషల్ మీడియాలో మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నా తమ్ముణ్ణి గెలిపించండి'.. సోషల్ మీడియాలో మెగాస్టార్ పోస్ట్ వైరల్

Chiranjeevi: 'నా తమ్ముణ్ణి గెలిపించండి'.. సోషల్ మీడియాలో మెగాస్టార్ పోస్ట్ వైరల్

వ్రాసిన వారు Stalin
May 07, 2024
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పోస్ట్ విడుదల చేశారు. జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం పవన్ ది అన్నారు. రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చాడని జనం కోసం ఆలోచించే జనసైనికున్ని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు. తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, మత్స్యకారులకు సాయం చేయడం, సరిహద్దుల్లో జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించడం చూస్తే ఇలాంటి నాయకుడు కదా జనాలకి కావాల్సింది అనిపిస్తుంది. తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే భాదేస్తుందని కానీ ఎంతో మంది బిడ్డల భవిష్యత్తు కోసం పవన్ చేసే పోరాటం గొప్పది అన్నారు.

Details 

నమ్మిన సిద్ధాంతం కోసం నిజాయితీగా ముందు కెళ్తున్న పవన్: చిరంజీవి 

రాష్ట్ర భవిష్యత్తు కోసం చట్ట సభల్లో అతడి గొంతును మనం వినాలి. అందుకే పవన్ కళ్యాణ్ ను పిఠాపురం ప్రజలు గెలిపించాలని కోరారు. అధికారం లేకున్నా ఎంతోమందికి సాయం చేస్తున్నాడు వారి భవిష్యత్తు కోసం పోరాడుతున్నాడు. పవన్ ను తిడుతుంటే తన తల్లి ఎంతో బాధపడుతోందన్నారు. ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోరాడాలి తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిజాయితీగా ముందు కెళ్తున్న పవన్ ను గెలిపించాలని అన్నారు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తే సేవకుడిగా, జన సైనికుడిగా అండగా నిలబడతాడు అని మీ కలలు సాకారం కావాలి అంటే పిఠాపురం ప్రజలు గాజు గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.