Page Loader
Director Krish: విడుదలకు ముందు దర్శకుడు క్రిష్ స్పందన.. పవన్‌, రత్నం లెజెండ్స్‌ అంటూ ప్రశంసలు
విడుదలకు ముందు దర్శకుడు క్రిష్ స్పందన.. పవన్‌, రత్నం లెజెండ్స్‌ అంటూ ప్రశంసలు

Director Krish: విడుదలకు ముందు దర్శకుడు క్రిష్ స్పందన.. పవన్‌, రత్నం లెజెండ్స్‌ అంటూ ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) సినిమా గురించి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట తన దర్శకత్వంలో ప్రారంభమైన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చివరకు జ్యోతికృష్ణ ద్వారా పూర్తయ్యింది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండగా, క్రిష్‌ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేశారు. 'ఇప్పుడు వీరమల్లు ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది నిశ్శబ్దంగా కాదు.. గొప్ప ఆశయంతో చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న చిత్రమవుతుంది. ఈ సినిమా ఇద్దరు లెజెండ్స్‌ వల్లే సాధ్యమైంది. వారు కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. వారిలో మొదటిగానే పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) పేరు చెబుతాను.

Details

ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఇచ్చింది

అసాధారణ శక్తికి రూపం ఆయన. నిత్యం రగిలే అగ్నికణంలా ఉంటారు. ఎంతో మందికి ఆదర్శం. 'హరి హర వీరమల్లు' చిత్రానికి ప్రాణం పోసిన వ్యక్తి పవన్‌నే. ఈ సినిమాకు ఆయన వెన్నెముకలాంటివారని క్రిష్ అన్నారు.'మరో లెజెండ్ నిర్మాత ఏఎం రత్నం. భారతీయ సినీ రంగంలో గౌరవనీయమైన స్థానం కలిగిన ఆయన.. ఈ సినిమాను అపారమైన విశ్వాసంతో నిర్మించారు. ఇంత సామర్థ్యం, పట్టుదల ఉన్న నిర్మాతలు అరుదుగా కనిపిస్తారు. ఆయనే ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపించిన శక్తి. ఈ సినిమా నాకెంతో ప్రీతిపాత్రమైనది. కేవలం దర్శకత్వంగానే కాక, కథను అభివృద్ధి చేయడంలోనూ ఎంతో నేర్చుకున్నాను. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఇచ్చింది'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Details

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం ఇది

ఈ సందర్భంగా క్రిష్‌ ప్రత్యేకంగా పవన్‌కల్యాణ్, ఏఎం రత్నంలకు కృతజ్ఞతలు తెలిపారు. ''ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే స్థాయిలో నిలవాలి'' అని ఆశాభావం వ్యక్తం చేశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్‌ను మొదట క్రిష్‌ స్వయంగా తెరకెక్కించగా, గత ఏడాది విడుదలైన టీజర్ సమయంలో దానికి దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చేపట్టినట్టు ప్రకటించారు. క్రిష్ పర్యవేక్షణలో జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. తాజాగా ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ కూడా క్రిష్‌ను ప్రశంసిస్తూ మాట్లాడారు. అద్భుతమైన కాన్సెప్ట్‌తో తనను సంప్రదించాడంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఇక, సుదీర్ఘంగా ఎదురుచూసిన ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.