
Yogi Adityanath:యోగి ఆదిత్యనాథ్ సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వడంలో జాప్యం.. సీబీఎఫ్సీని మందలించిన హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా 'అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి'(Ajey: The Untold Story of a Yogi)ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్టాపిక్గా మారింది. ఈ బయోపిక్కి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు)సర్టిఫికెట్ ఇవ్వడాన్ని తిరస్కరించింది. ఈ పరిణామం నేపథ్యంలో దర్శకనిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఈ సినిమాలో యోగి ఆదిత్యనాథ్ పాత్రకు 'అజయ్ మోహన్సింగ్' అనే పేరును పెట్టారు. ఈ పాత్రను నటుడు అనంత్ జోషి పోషించారు.ఇటీవల ఈ చిత్రం సెన్సార్ బోర్డుకు సమర్పించగా, బోర్డు చూసిన తర్వాత సర్టిఫికెట్ జారీ చేయలేమని తేల్చింది. దీనిపై వ్యతిరేకంగా నిర్మాతలు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ వ్యవహారంపై శుక్రవారం విచారణ జరగనుంది.
వివరాలు
సినిమాకు సెన్సార్ ఎందుకు నిరాకరించారో తెలపాలన్న కోర్టు
పిటిషన్ స్వీకరించిన కోర్టు, సెన్సార్ బోర్డును కొన్ని కీలకమైన ప్రశ్నలు అడిగింది. ఎనిమిదేళ్లుగా ప్రజాదరణ పొందుతోన్న ఒక నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకనిర్మాతలు కోర్టులో వాదించారు. అలాంటి పుస్తకంపై ఎటువంటి అభ్యంతరాలు లేనప్పుడు, దాని ఆధారంగా తెరకెక్కించిన సినిమాకు సెన్సార్ ఎందుకు నిరాకరించారో తెలపాలని కోర్టు బోర్డును ఆదేశించింది. పుస్తకం ఎలాంటి వ్యతిరేకతను సృష్టించనప్పుడు, దానిపై ఆధారంగా తీసిన సినిమా ఎలా తప్పుదోవ పట్టిస్తుందని నిరాకరించారో స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే, సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసి సమాధానం ఇవ్వాలని కోరింది.
వివరాలు
మహంత్ పాత్రలో ప్రముఖ నటుడు
ఈ సందర్భంలో, సెన్సార్ బోర్డు సభ్యులు పూర్తి సినిమా చూసే ప్రయత్నం చేయకుండానే కేవలం ట్రైలర్ ఆధారంగా సినిమా సర్టిఫికెట్ నిరాకరించారని, ఇది సరికాదని నిర్మాతల తరఫున న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ చిత్రానికి రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించగా, యోగి ఆదిత్యనాథ్ గురువుగా చరిత్రలో నిలిచిన మహంత్ పాత్రలో ప్రముఖ నటుడు పరేష్ రావల్ నటించారు.