
Dhanush: 'కుబేర మూవీ కోసం తిరుపతి వీధుల్లో భిక్షమెత్తా'.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో ధనుష్
ఈ వార్తాకథనం ఏంటి
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ "కుబేర" చిత్రం జూన్ 20న విడుదలయ్యింది.
ఈ సినిమా తొలి రోజే మంచి స్పందన అందుకుంటోంది. యూఎస్ ప్రీమియర్ షోస్తో పాటు భారతదేశంలో జరిగిన స్పెషల్ షోల ద్వారా ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడింది.
ఇందులో ధనుష్ ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించగా, నాగార్జున ధనవంతుడి పాత్రలో కనిపించారు.
వీరిద్దరి మధ్య సాగే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ధనుష్ ఈ సినిమాపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
వీధుల్లో అడుగుతూ నటన
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక సామాజిక నేపథ్యం ఉన్న డ్రామాగా రూపొందింది.
ఇందులో ధనుష్ తన పాత్ర కోసం తీవ్రంగా కృషి చేశారు. స్వయంగా ధనుష్ వెల్లడించగా, ఈ చిత్రానికి సైన్ చేసిన తర్వాత తిరుపతి వీధుల్లో భిక్షాటన కూడా చేశారని తెలిపారు.
"దర్శకుడిగా శేఖర్ గారి పేరు నమ్మి వెంటనే సినిమా చేయడానికి అంగీకరించాను. కానీ చివరికి నన్ను తిరుపతి వీధుల్లో భిక్షాటన చేయించాల్సి వచ్చింది. 'కుబేర' నా 51వ తమిళ చిత్రం కాగా, 'సార్' తర్వాత ఇది నా రెండో తెలుగు సినిమా. వాస్తవానికి శేఖర్ గారు నన్ను 'సార్' సినిమా కంటే ముందు కుబేర కథతో సంప్రదించారు" అని ధనుష్ వెల్లడించారు.
వివరాలు
ధనుష్ నటన మరో స్థాయిలో
ఈ సినిమాలో ధనుష్ నటనపై ప్రేక్షకుల నుంచి భారీ ప్రశంసలు వస్తున్నాయి.
ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ధనుష్ ఓ బిచ్చగాడిగా కనిపించారు.
ఓ సామాన్య బిచ్చగాడు సిస్టమ్కి సవాల్ విసిరేలా కథను దర్శకుడు అద్భుతంగా మలిచారు.
అతడిని పట్టుకోవడానికి నాగార్జున పోషించిన పాత్ర ఎంతగానో ఆసక్తిని రేపుతోంది.
ఈ గెటప్లో నటించడానికి ధనుష్ భౌతికంగా కూడా ఎంతో శ్రమించారు.
నగర వీధుల్లో భిక్షాటన చేయడంతో పాటు, చెత్త మైదానాల్లో, డంపింగ్ యార్డులో గంటల తరబడి నటించారని సమాచారం.
వివరాలు
ధనుష్ మారిన రూపం: అభిమానులు షాక్
కుబేర ట్రైలర్ విడుదలైనప్పుడు ధనుష్ లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు.
గడ్డంతో,చిరిగిన బట్టలతో,మురికి పోయిన దుస్తులతో ట్రైలర్లో కనిపించిన ధనుష్ను మొదట గుర్తుపట్టలేకపోయారు.
ఈ చిత్రంలో నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఇది ధనుష్కు ఈ ఏడాది తొలి సినిమా కావడం విశేషం.
సెన్సార్లో 19 సీన్లు కట్
పాన్ ఇండియా విడుదల కోసం రూపొందించిన ఈసినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)యూఏ సర్టిఫికేట్ మంజూరుచేసింది.
అయితే,ఒరిజినల్ కట్లో ఉన్న 19 సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించింది.
అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్పై సునీల్ నారంగ్,పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. "కుబేర"జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.