
Kannappa: కన్నప్ప విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ తిరస్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా, మంచు మోహన్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'పై వివాదం రేగిన సంగతి తెలిసిందే.
సినిమాలో కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణుల్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ, ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. అయితే పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
సినిమాను విడుదలకు అనుమతించకుండా ఆపివేయాలని కోరిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఇదే సమయంలో, ఈ వివాదానికి సంబంధించి పలువురికి నోటీసులు జారీ చేసింది.
Details
విచారణ ఆగస్టు 1కి వాయిదా
వీరిలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీఈఓ, CBFC ప్రాంతీయ కార్యాలయ అధికారి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దర్శకుడు ముఖేష్ కుమార్, నటులు మోహన్ బాబు, విష్ణు, కన్నెగంటి బ్రహ్మానందం, పి.వెంకట ప్రభుప్రసాద్, సప్తగిరి ఉన్నారు.
ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 1కి వాయిదా వేసింది. అలాగే సినిమా విడుదల అనంతరం ఇందులో అభ్యంతరకర కంటెంట్ ఏమైనా ఉంటే, వాటిని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.
ఈ తీర్పుతో సినిమాపై ఉన్న అనుమానాలు కొంతవరకు తొలగిపోయాయి.
దర్శక నిర్మాతలు, చిత్ర బృందానికి ఇది ఊరట కలిగించిన విషయమని చెప్పొచ్చు.