
Ananya Nagalla: కారవాన్లో కుర్చొని ఏడ్చేదాన్ని.. బ్రేకప్ స్టోరీ పంచుకున్న అనన్య నాగళ్ల
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల చిన్న చిత్రాలతో సినీ ప్రస్థానం ప్రారంభించి, 2018లో విడుదలైన 'మల్లేశం' మూవీ ద్వారా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో తన పాత్రతో మంచి గుర్తింపు పొందింది. తదుపరి 'శాకుంతలం', 'తంత్ర', 'పొట్టేల్' వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి, తన టాలెంట్తో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. యాక్టింగ్తోపాటు వ్యక్తిత్వంలోనూ ఎంతో ధృఢతను కనబరచిన అనన్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన విషాదకర ఘట్టాన్ని పంచుకుంది. 'చాలా మంది జీవితాలు వెలుగులో ఉన్నట్టు కనబడతాయి. కానీ, వారి బాధలు వెనుక దాగుంటాయి.
Details
బ్రేకప్ గురించి ఇంట్లో చెప్పలేదు
ఇండస్ట్రీకి వచ్చాక కొంతకాలానికే నా బ్రేకప్ జరిగింది. అది నా మనసుకు తాకిన పెద్ద షాక్. రెండు సంవత్సరాల పాటు ఆ బాధ నుంచి బయట పడలేకపోయా. రాత్రిపూట ఎమోషనల్ అయి ఏడ్చేసేదాన్ని, ఉదయాన్నే జిమ్కి వెళ్లేదాన్ని. కారవాన్లో కూడా ఏడుస్తూ, షూటింగ్ టైమ్ వచ్చే సరికి బాధ కనబడకుండా చూసుకునేదాన్ని అని తెలిపారు. కుటుంబానికి ఏ మాత్రం తెలియనివ్వలేదు. బ్రేకప్ బాధ నా కెరీర్పై ప్రభావం చూపకుండా చూసుకున్నాను. ప్రొఫెషనల్ లైఫ్లో ఎమోషన్లకు స్థానం ఇవ్వకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. నటిగా నన్ను నమ్మి అవకాశం ఇచ్చినవారిని నిరాశపరచకూడదని అనుకున్నా. అందుకే నా బాధను బయటకెక్కడా కనబడనివ్వలేదని అనన్య వివరించింది. ఆమె చెప్పిన ఈ మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి.