NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ
    ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

    PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 23, 2025
    12:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో కృత్రిమ మేధ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సాంకేతికతను మరింత వినియోగించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

    ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో కృత్రిమ మేధ ప్రభావం గురించి ప్రస్తావించారు.

    తెలంగాణలోని ఓ ఉపాధ్యాయుడి కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

    అంతరిక్ష రంగంలో దేశం సాధిస్తున్న ప్రగతిని వివరించారు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేయడం దేశానికి గర్వకారణమని మోదీ కొనియాడారు.

    Details

    460 ఉపగ్రహాలు లాంచ్

    అంతరిక్ష శాస్త్ర సరిహద్దులను అధిగమించాలనే భారత్‌ సంకల్పానికి ఇది నిదర్శనమని చెప్పారు.

    గత దశాబ్దంలో దాదాపు 460 ఉపగ్రహాలను లాంచ్‌ చేశామని, ఏటా అంతరిక్ష రంగంలో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

    చంద్రయాన్‌ విజయంతో భారత్‌ అంతరిక్షం రంగంలో మరింత స్థిరపడిందన్నారు. ఈ రంగంపై యువత ఆసక్తి చూపడం ప్రోత్సాహకరమని చెప్పారు.

    అలాగే ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం పెరుగుతుండటం దేశ విజయాల్లో కీలకమని పేర్కొన్నారు.

    Details

    కృత్రిమ మేధ వినియోగంపై మోదీ అభిప్రాయాలు 

    ఇటీవల ఏఐ సదస్సులో పాల్గొనేందుకు పారిస్‌కు వెళ్లానని, భారత్‌ ఈ రంగంలో సాధించిన పురోగతిని ప్రపంచం ప్రశంసించిందన్నారు.

    ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు తొడసం కైలాష్‌ గిరిజన భాషలను పరిరక్షించడంలో కృత్రిమ మేధ సహాయాన్ని వినియోగించారన్నారు.

    కోలామి భాషలో పాటను కంపోజ్‌ చేయడం ద్వారా ఓ గొప్ప ప్రయత్నం చేశారని ప్రధాని అన్నారు. అంతరిక్షం లేదా కృత్రిమ మేధ వంటి రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని మోదీ తెలిపారు.

    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, వారి జీవితాల్లో స్ఫూర్తినింపేలా ఒక రోజు తన సోషల్ మీడియా ఖాతాను మహిళలకు అంకితం చేస్తానని వెల్లడించారు.

    దేశ స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగ రూపకల్పనలో మహిళల పాత్రను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఇండియా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    నరేంద్ర మోదీ

    Modi-Trump: ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌కు మోదీ.. వెల్లడించిన ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    PM Modi:  'కోల్డ్‌ ప్లే' ప్రదర్శనల గురించి ప్రధాని ప్రస్తావన.. కాన్సర్ట్‌ ఎకానమీకి మోదీ బూస్ట్‌ భారతదేశం
    National Games: డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో 38వ నేషనల్‌ గేమ్స్‌ ని ప్రారంభించిన ప్రధాని మోదీ క్రీడలు
    Stampede in Mahakumbh: కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రధాని మోదీ నాలుగుసార్లు ఫోన్ చేశారు : యోగి ఆదిత్యనాథ్‌ యోగి ఆదిత్యనాథ్

    ఇండియా

    Scarlet fever: పిల్లలు జాగ్రత్త.. హైద‌రాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న స్కార్లెట్ ఫీవ‌ర్ కేసులు హైదరాబాద్
    Naval Ships:భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ నరేంద్ర మోదీ
    India Vs Pakistan: 'ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' డాక్యుమెంటరీ ఎక్కడ చూడాలంటే?  పాకిస్థాన్
    West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025