LOADING...
Jana Nayagan: 'జన నాయగన్‌' సెన్సార్ గందరగోళం.. నిర్మాత వెంకట్‌ ఆవేదన
'జన నాయగన్‌' సెన్సార్ గందరగోళం.. నిర్మాత వెంకట్‌ ఆవేదన

Jana Nayagan: 'జన నాయగన్‌' సెన్సార్ గందరగోళం.. నిర్మాత వెంకట్‌ ఆవేదన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'జన నాయగన్‌' (తెలుగులో 'జన నాయకుడు') విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ రాకపోవడం కారణంగా ఈ గందరగోళం ఏర్పడింది. విజయ్‌కు సినిమాతో గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలని అనుకున్న నిర్మాత వెంకట్‌ కె. నారాయణ ఈ పరిస్థితి కారణంగా బాధ వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా అభిమానులను అలరించిన విజయ్‌కు సరైన వీడ్కోలు దక్కాలనే ఆశ ఆయన వ్యక్తం చేశారు. 'జన నాయగన్‌' షూటింగ్‌ పూర్తయిన తర్వాత 2025 డిసెంబర్‌ 18న సెన్సార్‌ బోర్డుకు సమర్పించాం. డిసెంబర్‌ 22న యూ/ఏ సర్టిఫికెట్‌ ఇస్తామని ఈమెయిల్‌ ద్వారా సమాచారం వచ్చింది. కొన్ని మార్పులు సూచించారు.

Details

ఈ మూవీ కోసం కష్టపడి టీమ్‌కి కృతజ్ఞతలు

ఆ మార్పులు పూర్తి చేసి సినిమాను మళ్లీ సెన్సార్‌ బోర్డుకు పంపాము. విడుదలకు సిద్ధం చేసుకుంటున్న సమయంలో జనవరి 5న ఫిర్యాదులు వచ్చాయని, సెన్సార్‌ బోర్డు దీనిని రివైజింగ్‌ కమిటీకి రిఫర్‌ చేస్తోందని మాకు తెలియజేశారు. రివైజింగ్‌ కమిటీని సంప్రదించడానికి సమయం మించిపోయినందున, అసలు ఎవరు ఫిర్యాదు చేసారో స్పష్టత లేకపోవడంతో మేము హైకోర్టును ఆశ్రయించామని ఆయన తెలిపారు. వెంకట్‌ కె. నారాయణ విజయ్ ఇది చాలా విపత్కర సమయం. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో విడుదల ప్రక్రియ కష్టతరం అయింది. ఈ సినిమా కోసం సుదీర్ఘంగా కష్టపడిన టీమ్‌కి కృతజ్ఞతలు.

Details

తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా

అభిమానులకు, పంపిణీదారులకు క్షమాపణలు. చట్టపరమైన సమస్యల కారణంగా పరిస్థితి మా చేయి దాటిపోయిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. హెచ్‌. వినోద్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌కు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేయాలని మద్రాసు హైకోర్టు సింగిల్‌ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో విజయ్ అభిమానులు, చిత్ర బృందం ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement