LOADING...
Mohanlal: జాతీయ గౌరవం దక్కించుకున్న మోహన్‌లాల్‌పై మలయాళీ సంఘాల ప్రశంసల వర్షం
జాతీయ గౌరవం దక్కించుకున్న మోహన్‌లాల్‌పై మలయాళీ సంఘాల ప్రశంసల వర్షం

Mohanlal: జాతీయ గౌరవం దక్కించుకున్న మోహన్‌లాల్‌పై మలయాళీ సంఘాల ప్రశంసల వర్షం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2025
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మలయాళ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత మోహన్‌లాల్‌ను వరల్డ్ మలయాళీ కౌన్సిల్‌, ఆల్‌ ఇండియా మలయాళీ అసోసియేషన్‌ హృదయపూర్వకంగా అభినందించాయి. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మంగళవారం (సెప్టెంబర్‌ 23న) జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ అవార్డులతో పాటు ప్రశంసాపత్రాలను కూడా అందజేశారు. ఈ క్రమంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌ లాల్‌కు భారతీయ సినీ రంగంలో చేసిన విశిష్టమైన కృషిని గుర్తిస్తూ దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం లభించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో ఆయన చేస్తున్న అపూర్వమైన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రదానం చేసింది.

Details

జవాన్' చిత్రానికి గాను షారుఖ్‌ ఖాన్‌ కు అవార్డు

ఈ వేడుకలో 'జవాన్' చిత్రానికి గాను షారుఖ్‌ ఖాన్‌, ట్వెల్థ్ ఫెయిల్ సినిమాకు విక్రాంత్‌ మాస్సే ఉత్తమ నటులుగా అవార్డులు అందుకోగా, మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే సినిమాకు గాను రాణీ ముఖర్జీ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును స్వీకరించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడే ఈ అవార్డు, భారతీయ సినిమావ్యాప్తి, అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి సత్కరించే గౌరవం. వరల్డ్‌ మలయాళీ కౌన్సిల్‌ గ్లోబల్‌ వైస్‌ చైర్మన్‌, గుజరాత్‌లోని ఆల్‌ ఇండియా మలయాళీ అసోసియేషన్‌ అధ్యక్షుడు దినేష్‌ నాయర్‌ మాట్లాడుతూ, మోహన్‌లాల్‌ సాధించిన ఈ విజయం మలయాళీలు, కేరళీయులు గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు.

Details

400కి పైగా చిత్రాల్లో నటన

ఆయన అంకితభావం, కృషి అందరికీ ఆదర్శమని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా 400కి పైగా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన మోహన్‌లాల్‌ అద్భుతమైన సినిమా ప్రయాణం ఇది. ఆయన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, నిరంతర శ్రేష్ఠత సాధనకు ఈ అవార్డు నిదర్శనమని నాయర్‌ అన్నారు.

Advertisement

Details

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వివరాలు 

1969లో ప్రారంభమైన ఈ అవార్డు భారతీయ సినీ పరిశ్రమకు చేసిన విశిష్ట కృషిని గుర్తించే ప్రతిష్టాత్మక గౌరవం. ఇందులో స్వర్ణ కమలం పతకం, శాలువా, రూ.10 లక్షల నగదు బహుమతి ఉంటాయి. 2025 సెప్టెంబర్‌ 23న న్యూఢిల్లీలో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో మోహన్‌లాల్‌ ఈ గౌరవాన్ని స్వీకరించి, దానిని మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమకు అంకితం చేశారు.

Advertisement