
Manchu Vishnu: 'కన్నప్ప' పైరసీ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంచు విష్ణు
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'కన్నప్ప' ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా పైరసీకి గురవుతోందన్న విషయం మంచు విష్ణును తీవ్రంగా కలచివేసింది. ఎవరూ పైరసీని ప్రోత్సహించకుండా ఉండాలని కోరుతూ ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. '''కన్నప్ప' సినిమా పైరసీ బాధ కలిగించే విషయం.ఇప్పటివరకు మా బృందం దాదాపు 30వేల అనధికారిక లింకులను తొలగించింది.ఈ ఘటన మనసుకు చాలా బాధను కలిగించింది.పైరసీ అనేది ఒకరకంగా దొంగతనమే.మనం మన పిల్లలకు దొంగతనాన్ని నేర్పించం కదా..అలాంటప్పుడు అనధికారిక లింకుల ద్వారా సినిమాను చూడడమూ అదే తరహా దొంగతనమే.దయచేసి ఇలాంటి పనులకు ప్రోత్సాహం ఇవ్వకండి.'కన్నప్ప' చిత్రాన్నిచట్టబద్ధమైన మార్గంలో,మద్దతుగా ఆదరించండి,'' అంటూ విష్ణు తన భావాలను వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విష్ణు మంచు చేసిన ట్వీట్
Dear movie lovers,#Kannappa is under attack from piracy. Over 30,000 illegal links have already been taken down. This is heartbreaking.
— Vishnu Manchu (@iVishnuManchu) June 30, 2025
Piracy is theft — plain and simple. We don’t teach our children to steal. Watching pirated content is no different.
Please don’t encourage…
వివరాలు
విష్ణు తర్వాత సినిమా ఎవరితోనంటే!
'కన్నప్ప' విజయం అనంతరం మంచు విష్ణు తదుపరి ప్రాజెక్ట్పై ఆసక్తి పెరిగింది. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, 'కన్నప్ప'కు కొరియోగ్రాఫర్గా పనిచేసిన ప్రభుదేవ దర్శకత్వంలో మంచు విష్ణు తదుపరి చిత్రం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఇది హాస్య ప్రధానంగా ఉండే సినిమా అని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రావొచ్చని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.