Manju Warrier: ఆ హీరోతో ప్రయాణం ఎన్నో నేర్పింది.. మంజు వారియర్ కామెంట్స్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
నటి మంజు వారియర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లద్దాఖ్కు చేసిన తన బైక్ ట్రిప్ అనుభవాలను పంచుకున్నారు. నటుడు అజిత్ కుమార్తో కలిసి సుమారు 14 రోజుల పాటు జరిగిన ఈ ప్రయాణం తనకు ఎంతో కొత్త విషయాలను నేర్పిందని ఆమె వెల్లడించారు. "అజిత్తో కలిసి చేసిన ఆ బైక్ రైడ్ నా ఆలోచన విధానాన్ని మార్చేసింది. లద్దాఖ్లో ఆయన టీమ్ను కలిశాను. దాదాపు 14 రోజుల పాటు వారితో కలిసి ప్రయాణించాను. ఆ సమయంలో అజిత్ కుమార్ నన్ను చాలా విషయాల్లో మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా, ఏదైనా ప్రమాదం జరిగితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో మొదటి రోజే వివరంగా చెప్పారు.
వివరాలు
ఆ ట్రిప్ జీవితాన్నే మార్చేసింది..
నాకు బైక్ నడపడం తెలిసినా, అప్పటికి నా వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదు. వారందరూ ప్రొఫెషనల్ రైడర్స్ కావడంతో, వాళ్లతో కలిసి ప్రయాణించడం నాకు ఒక కొత్త అనుభవంగా అనిపించింది. ఆ ట్రిప్ ముగిసిన తర్వాతనే నేను లైసెన్స్ పొందాను" అని మంజు వారియర్ తెలిపారు. అజిత్కు సినిమాలపై ఎంత అభిరుచి ఉందో, మోటార్ రేసింగ్పైనా అంతే ఆసక్తి ఉంది. ఆయన అనేకసార్లు రేసింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా 'అజిత్ కుమార్ రేసింగ్' అనే టీమ్ను కూడా నడుపుతున్నారు. మంజు వారియర్, అజిత్ కలిసి 'తునివు' (తెలుగులో 'తెగింపు') సినిమాలో నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఇద్దరూ కలిసి లద్దాఖ్ ట్రిప్కి వెళ్లారు.