NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Mansoor Ali : త్రిషాపై మన్సూర్ అలీ పరువు నష్టం దావా.. చివాట్లు పెట్టిన మద్రాస్ హైకోర్టు 
    తదుపరి వార్తా కథనం
    Mansoor Ali : త్రిషాపై మన్సూర్ అలీ పరువు నష్టం దావా.. చివాట్లు పెట్టిన మద్రాస్ హైకోర్టు 
    Mansoor Ali : త్రిషాపై మన్సూర్ పరువు నష్టందావా..చివాట్లు పెట్టిన మద్రాస్ హైకోర్టు

    Mansoor Ali : త్రిషాపై మన్సూర్ అలీ పరువు నష్టం దావా.. చివాట్లు పెట్టిన మద్రాస్ హైకోర్టు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 12, 2023
    11:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కోలీవుడ్‌ సహా ఇతర సినీ పరిశ్రమల్లోనూ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

    త్రిషపై రేప్ కామెంట్స్‌ చేసిన అలీఖాన్' స్టేట్మెంట్స్'ను సెలబ్రిటీలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మహిళా సంఘాలు సైతం భగ్గుమన్నాయి.

    ఈ క్రమంలోనే మాన్సూర్‌పై కేసులు కూడా నమోదు చేయించాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో త్రిషకు సారీ చెప్పాడు నటుడు.

    అంతా సర్దుకుంది అనుకున్న సమయంలో త్రిషపై ఆయన పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన మద్రాస్ హైకోర్టు మన్సూర్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది.

    త్రిషనే ముందుగా అలీఖాన్ పై కేసు పెట్టాల్సిందని అభిప్రాయపడ్డ న్యాయస్థానం, కేసును కొట్టిపారేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

    details

    మన్సూర్ అలీఖాన్'కు మొట్టికాయలు వేసిన హైకోర్టు

    డిసెంబర్ 10న మన్సూర్ అలీ ఖాన్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై మద్రాస్ హైకోర్టు స్పందించింది.

    మీరు యాక్టర్ కాబట్టి యువత మిమ్మల్ని ఒక రోల్ మోడల్‌గా చూస్తారని హితబోధ చేసింది.సాటి నటీమణిపై సంస్కారహీనంగా మాట్లాడటం మీకు సరైనదేనా అని అసంతృప్తి వెలుబుచ్చింది.

    మన్సూర్ తరపున వాదించే న్యాయవాదిపై సీరియస్ అయ్యింది. పబ్లిక్ ప్రదేశాల్లో ఓ నటుడు ఎలా ప్రవర్తించాలో చెప్పమని ఆదేశించింది.

    ఈమేరకు తన పిటిషన్'కు విచారణ అర్హత లేదని తేల్చిన ఉన్నత న్యాయస్థానం అలీఖాన్ పిటిషన్'ను కొట్టేసింది.

    అంతా మన్సూర్ అలీ ఖాన్‌ వ్యాఖ్యలను ఖండిస్తుండటంతో వేరేదారిలేక సారీ చెప్పేశాడు.దీంతో త్రిష కూడా సారీని ఒప్పుకుంటున్నట్టుగా ట్వీట్ చేసింది.

    అంతా అయిపోయిందనుకునేలోగా అలీఖాన్ పరువు నష్టందావాతో హైకోర్టును ఆశ్రయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    త్రిష

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    త్రిష

    Trisha : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఆమె పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి! కోలీవుడ్
    Trisha : త్రిష కేసులో ట్విస్ట్..ఖుష్భూ,చిరంజీవిపై పరువు నష్టం దావా వేయనున్న అలీఖాన్ కోలీవుడ్
    Mansoor Alikhan : చిరంజీవిపై సంచలన ఆరోపణలు..పార్టీ పెట్టి రూ.1000 కోట్లు వెనకేసుకున్నారు చిరంజీవి
    Trisha: 16 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో హీరోయిన్‌గా త్రిష చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025