
Mirai: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో 'మిరాయ్'
ఈ వార్తాకథనం ఏంటి
తేజ సజ్జా, మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మిరాయ్' (Mirai) భారీ విజయం సాధించింది. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాగా.. మొదటి రోజే రూ.20 కోట్ల వసూలు రాబట్టిన ఈ చిత్రం, ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. తమ చిత్రం రూ.100 కోట్లు కలెక్ట్ చేయడంపై తేజ సజ్జా, మంచు మనోజ్ ఇద్దరూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ప్రేక్షకులంతా కుటుంబంతో కలిసి సినిమా చూడాలన్న ఉద్దేశంతోనే దీని టికెట్ ధరలు కూడా పెంచలేదని నిర్మాత తెలిపారు.
వివరాలు
'మిరాయ్' సీక్వెల్లో నిధి అగర్వాల్
ఈ విజయం తనలో మరింత బాధ్యతను పెంచిందని తేజ చెప్పారు. సినిమా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'మిరాయ్' సీక్వెల్లో నిధి అగర్వాల్ ఒక ప్రత్యేక పాటలో కనిపిస్తారని తెలిపారు. మొదటి పార్ట్లో ఆ పాటను ఉపయోగించలేకపోయామన్నారు, కానీ ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం కొన్ని కొత్త ఐడియాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మంచు మనోజ్ చేసిన ట్వీట్
100 Crores⚔️🔥
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 17, 2025
Big love and gratitude to Audience especially families for celebrating #Mirai with all your heart🙏🏼❤️🤗
This is the Victory of Good Cinema🔥#BlackSword 🚀 pic.twitter.com/hKClY8PcrN