NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Nayanthara: కెరీర్‌లో అండగా నిలిచిన షారుక్‌ ఖాన్‌, చిరంజీవికి నయనతార కృతజ్ఞతలు
    తదుపరి వార్తా కథనం
    Nayanthara: కెరీర్‌లో అండగా నిలిచిన షారుక్‌ ఖాన్‌, చిరంజీవికి నయనతార కృతజ్ఞతలు
    కెరీర్‌లో అండగా నిలిచిన షారుక్‌ ఖాన్‌, చిరంజీవికి నయనతార కృతజ్ఞతలు

    Nayanthara: కెరీర్‌లో అండగా నిలిచిన షారుక్‌ ఖాన్‌, చిరంజీవికి నయనతార కృతజ్ఞతలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 21, 2024
    11:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల నటి నయనతార తన డాక్యుమెంటరీ "నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌" ద్వారా ప్రేక్షకులను పలకరించారు.

    తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ఆమె ఒక పోస్ట్‌ పెట్టారు.

    బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్‌, టాలీవుడ్‌లో చిరంజీవి, రామ్‌ చరణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ డాక్యుమెంటరీ కోసం వీరిని సంప్రదించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని నయనతార పేర్కొన్నారు.

    వివరాలు 

    నా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది: నయనతార 

    "నా ప్రతి చిత్రానికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. నా సినీ ప్రయాణం ఎన్నో ఆనందకరమైన క్షణాలను అందించింది. చాలా సినిమాలు నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ జ్ఞాపకాలను, సన్నివేశాలను మా డాక్యుమెంటరీలో చేర్చాలని నాకు భావన వచ్చింది. దీనిపై నిర్మాతలను సంప్రదించినప్పుడు వారు ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీరంతా నాకు విలువైన క్షణాలను ఇచ్చారు. నా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది" అని ఆమె తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

    నయనతార తన డాక్యుమెంటరీలో పేర్కొన్న దర్శకులు, నిర్మాతలు, షారుక్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌, చిరంజీవి, రామ్‌చరణ్‌, తెలుగు, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమల ప్రముఖ వ్యక్తులు ఉన్నారు.

    వివరాలు 

    ధనుష్‌ లీగల్‌ నోటీసులు

    అయితే, నయనతార తన డాక్యుమెంటరీ విషయంలో నటుడు ధనుష్‌ తీరును విమర్శించిన విషయం గమనార్హం.

    "నానుమ్‌ రౌడీ దాన్‌" సినిమా నుంచి మూడు సెకన్ల క్లిప్స్‌ను డాక్యుమెంటరీ ట్రైలర్‌లో వాడుకున్నందుకు ధనుష్‌ రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్‌ చేశారన్నట్లు ఆమె ఆరోపించారు.

    ఈ విషయంలో లీగల్‌ నోటీసులు పంపినట్లు తెలిపారు.

    ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చలను రేపాయి. ఇప్పుడు నయనతార తన డాక్యుమెంటరీకి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పడంతో ఈ అంశం మళ్ళీ పాపులర్‌ అయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నయనతార

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    నయనతార

    ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన నయనతార: ఇంతకీ ఆమె ఎవరిని ఫాలో అవుతుందో తెలుసా?  తెలుగు సినిమా
    Shahrukh Khan : శ్రీవారి సేవలో షారూక్, కూతురు సుహానా, హీరోయిన్ నయనతార షారుక్ ఖాన్
    ముంబైలో తళుక్కుమన్న నయనతార.. బాలీవుడ్‌కూ ప్రాధాన్యత ఇస్తానన్న బ్యూటీ జవాన్
    బిజినెస్ లోకి దిగిన నయనతార దంపతులు: ఇంతకీ దేంట్లో పెట్టుబడులు పెడుతున్నారంటే?  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025