NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / #NewsBytesExplainer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెంటల్, పర్సంటేజ్ బేసిస్ వివాదం.. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే? 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    #NewsBytesExplainer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెంటల్, పర్సంటేజ్ బేసిస్ వివాదం.. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే? 
    తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెంటల్, పర్సంటేజ్ బేసిస్ వివాదం..

    #NewsBytesExplainer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెంటల్, పర్సంటేజ్ బేసిస్ వివాదం.. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 26, 2025
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

    ముఖ్యంగా థియేటర్ల అద్దె విధానం (రెంటల్), వసూళ్లపై భాగస్వామ్యం (పర్సంటేజ్) అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.

    ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలను రెండు విధాలుగా విడుదల చేస్తూ వచ్చారు.

    పెద్ద సినిమాలను ఎక్కువగా అద్దె పద్ధతిలో విడుదల చేస్తుండగా,చిన్న సినిమాలు లేదా క్రేజ్ తక్కువగా ఉన్న సినిమాలు మాత్రం పర్సంటేజ్ పద్ధతిలో విడుదలవుతున్నాయి.

    అయితే మల్టీప్లెక్స్ థియేటర్ల విషయానికి వస్తే, అక్కడ మాత్రం ప్రతీ చిత్రం పర్సంటేజ్ పద్ధతిలోనే ప్రదర్శితమవుతుంది.

    ఇలాంటి పరిస్థితుల మధ్య, సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు ఒకటై, ఇకపై అన్ని సినిమాలను పర్సంటేజ్ ఆధారంగా మాత్రమే ప్రదర్శించాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు.

    వివరాలు 

    రెంటల్, పర్సంటేజ్ అంటే ఏంటి?

    అయితే, 'రెంటల్' అంటే ఏమిటి? 'పర్సంటేజ్' అంటే ఏమిటి? అన్నది చాలా మంది ప్రేక్షకులకు స్పష్టంగా తెలియదు.

    అద్దె విధానం ప్రకారం, థియేటర్ యజమాని తన హాలునును చిత్ర నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్‌కు అద్దెకు ఇచ్చినట్లవుతుంది.

    ఇదో రకంగా పెళ్లి మండపం అద్దెకు ఇచ్చినట్టే. అయితే పర్సంటేజ్ విధానం వేరుగా ఉంటుంది.

    ఇందులో సినిమా టికెట్ల అమ్మకాలను ఆధారంగా చేసుకుని, వాటిలో ఒక శాతాన్ని థియేటర్ యజమానికి, మిగతా భాగాన్ని నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్‌కు అందేలా ఓ ఒప్పందం కుదురుతుంది.

    వివరాలు 

    పెద్ద చిత్రాలు ఎక్కువగా అద్దె విధానంలో..

    ఇప్పటివరకు అమలులో ఉన్న విధానం ప్రకారం, పెద్ద చిత్రాలను ఎక్కువగా అద్దె విధానంలో విడుదల చేస్తున్నారు.

    అయితే, ఈ విధానం వల్ల తమకు నష్టాలు ఎదురవుతున్నాయని, పర్సంటేజ్ విధానంలో పెద్ద సినిమాలను ప్రదర్శిస్తే తమకూ కొంత లాభం దక్కవచ్చని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు వాదిస్తున్నారు.

    చిన్న సినిమాలు ఇప్పటికే పర్సంటేజ్ పద్ధతిలో వస్తున్నా, వాటి వల్ల పెద్దగా లాభాలు లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు.

    అయితే, పర్సంటేజ్ పద్ధతిలో పెద్ద సినిమాలను రిలీజ్ చేయడం సురక్షితమేమీ కాదని, ఇందులో ఎంతో రిస్క్ ఉన్నదని కొందరు ప్రముఖ నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.

    వివరాలు 

    రెంటల్ పద్ధతిని దుర్వినియోగం చేస్తున్న కొందరు నిర్మాతలు

    వాస్తవానికి ఈరెండు విధానాల్లోనూ స్వల్ప వ్యత్యాసాలు ఉన్నా,లాభనష్టాల పరంగా రెండింటికీ తమదైన ప్రాముఖ్యత ఉంది.

    కానీ, సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు మాత్రం ఇకపై పూర్తిగా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

    దీనికి కారణంగా కొన్ని ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి.ముఖ్యంగా కొందరు నిర్మాతలు రెంటల్ పద్ధతిని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    ఈ ఆరోపణలు వాస్తవంగా ఎంతవరకు నిజమో అనే దానిపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.

    పరిస్థితి ఇంత తీవ్రమవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా విచారణకు ఆదేశించాల్సిన స్థాయికి చేరింది.

    ఈ నేపథ్యంలో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 'రిటర్న్ గిఫ్ట్' పేరిట సినీ పరిశ్రమపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈ వ్యవహారాన్ని మరింత ఉద్రిక్తతకు గురిచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    #NewsBytesExplainer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెంటల్, పర్సంటేజ్ బేసిస్ వివాదం.. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే?  టాలీవుడ్
    YSR Kadapa: వైఎస్సార్ జిల్లాకు మళ్లీ పాత పేరు.. జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం కడప
    Rajya Sabha Elections: జూన్ 19న ఆ 8 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు  రాజ్యసభ
    Emmanuel Macron: మాక్రాన్‌ను చెంపపై కొట్టిన భార్య బ్రిగిట్టే.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

    టాలీవుడ్

    Naga Chaitanya: తండేల్ మూవీ క‌థ‌ ఆధారంగా వెబ్‌సిరీస్‌.. టైటిల్ ఫిక్స్! నాగ చైతన్య
    Sriram : ఘోర అగ్నిప్రమాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీరామ్ మృతి అగ్నిప్రమాదం
    Tollywood: చిరంజీవితో తీద్దామనుకుని.. చివరకు వెంకటేష్‌తో చిత్రీకరణ - కృష్ణంరాజు కేసుతో డిజాస్టర్  సినిమా
    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025