NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Junior NTR: హైకోర్టు మెట్లెక్కిన జూనియర్ ఎన్టీఆర్.. భూ వివాదంలో మహిళప కేసు
    తదుపరి వార్తా కథనం
    Junior NTR: హైకోర్టు మెట్లెక్కిన జూనియర్ ఎన్టీఆర్.. భూ వివాదంలో మహిళప కేసు
    హైకోర్టు మెట్లెక్కిన జూనియర్ ఎన్టీఆర్.. భూ వివాదంలో మహిళపై కేసు

    Junior NTR: హైకోర్టు మెట్లెక్కిన జూనియర్ ఎన్టీఆర్.. భూ వివాదంలో మహిళప కేసు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 17, 2024
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.75లో ఉన్న తన భూ వివాదం కేసుపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

    వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్ 2003లో సుంకు గీతా లక్ష్మి అనే మహిళ నుంచి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్నీ కొనుగోలు చేశారు.

    చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు.

    కానీ ఈ స్థలంపై వివాదం చెలరేగింది.

    Details

    ఎన్టీఆర్ కు షాకిచ్చిన రికవరీ ట్రిబ్యునల్

    సమాచారం ప్రకారం,ఆ భూమిని ఎన్టీఆర్ కు అమ్మక ముందే సుంకు గీత 1996లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి లోన్ తీసుకున్నారంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి.

    దీంతో ఈ స్థలానికి సంబంధించి ఎన్టీఆర్ కు నోటీసులు వచ్చాయి.

    అయితే రుణ క్లియరెన్స్ విషయమై బ్యాంకు మేనేజర్లు పలుమార్లు ఎన్టీఆర్ కు ఫోన్ చేశారు.

    2019లో తాను అసలు నిందితుడిని కానప్పటికీ బ్యాంకు మేనేజర్లు డబ్బులు అడుగుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    2019లో ఈ వ్యవహారంలో దీనిపై పోలీసులు ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు.

    Details

    సుంకు గీతపై కేసు నమోదు

    తాజాగా గీతకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT)ని ఆశ్రయించాయి.

    ఎన్టీఆర్‌పై డీఆర్‌టీ ఉత్తర్వులు జారీ చేసింది. డీఆర్‌టీ ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.

    గీతపై కేసు నమోదైందని, ఈ పిటిషన్‌పై జూన్ 6న విచారిస్తామని హైకోర్టు పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్

    తాజా

    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం

    జూనియర్ ఎన్టీఆర్

    ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్: మరోమారు అంబాసిడర్ గా తీసుకున్న సంస్థ  సినిమా
    దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్  తెలుగు సినిమా
    అభిమాని మరణంపై ఎన్టీఆర్ సంతాపం: విచారణ జరిపించాలని కోరిన ఆర్ఆర్ఆర్ హీరో  తెలుగు సినిమా
    ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా ఆర్ఆర్ఆర్ నుండి ఆరుగురు  ఆస్కార్ అవార్డ్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025