పొన్నియన్ సెల్వన్ 2 రివ్యూ: రెండవ భాగంలో మణిరత్నం మాయ చేసాడా?
నటీనటులు: విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ్ళ, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, రెహమాన్ తదితరులు. దర్శకత్వం: మణిరత్నం నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్ మ్యూజిక్: ఏఆర్ రెహమాన్ కథ: వల్లయ రాయ వందివ దేవుడు (కార్తీ), పొన్నియన్ సెల్వన్(జయం రవి) సముద్ర ప్రమాదంలో చిక్కుకోవడంతో మొదటి భాగం పూర్తవుతుంది. రెండవ భాగాన్ని ఆదిత్య కరికాలుడు(విక్రమ్), ఐశ్వర్యా రాయ్(నందిని) ప్రేమకథతో మొదలెడతాడు. ఇటు సముద్రంలో చిక్కుకున్న వల్లవ రాయుడుని, పొన్నియన్ సెల్వన్ లను పూంగుళి(ఐశ్వర్య లక్ష్మి) కాపాడుతుంది. ఇదిలా ఉండగా ఆదిత్య కరికాలుడు, పొన్నియన్ సెల్వన్, కుందవై లను చంపాలని పాండ్యులతో కలుస్తుంది నందిని. మరి నందిని పంతం నెగ్గిందా లేదా అనేదే కథ.
ఆకట్టుకున్న విక్రమ్, ఐశ్వర్యా రాయ్ పాత్రల కెమిస్ట్రీ
సినిమా మొదలు కావడం చాలా ఆసక్తిగా జరిగింది. విక్రమ్, ఐశ్వర్యా రాయ్ మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. అలాగే త్రిష, కార్తీ ప్రేమ కథ ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్ స్క్రోర్ సినిమాకు తగ్గట్టుగా ఉంది. ముఖ్యంగా కెమెరా పనితనం వేరే లెవెల్ అని చెప్పవచ్చు. చోళుల కాలాన్ని దగ్గరి నుండి చూసినట్టుగా ఉంది. అయితే కథలో కొంత గజిబిజీ ఇబ్బందిగా అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు మరీ ఎక్కువగా లేవు. ఉన్నవి కూడా సోసోగా అనిపించాయి. డ్రామా ఎక్కువగా ఉండడంతో కథనం నెమ్మదించిందన్న ఫీలింగ్ కలిగింది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే పొన్నియన్ సెల్వన్ రెండవభాగం మంచి అనుభూతిని అందిస్తుందని చెప్పవచ్చు. మొదటి భాగం చూసిన వాళ్ళు రెండవ భాగాన్ని మరింత ఎంజాయ్ చేయగలరు.