Prabhas: 'కన్నప్ప' మూవీ నుంచి ప్రభాస్ కొత్త లుక్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
ఆయన రుద్ర పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం తాజాగా పోస్టర్ విడుదల చేసింది.
"ప్రళయ కాల రుద్రుడు! త్రికాల మార్గదర్శకుడు!! శివాజ్ఞ పరిపాలకుడు!!!" అని ఆ పోస్టరులో పేర్కొంది.
ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తన కలల ప్రాజెక్టుగా పరిగణిస్తున్నాడు.
మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Details
పరమశివుడి పాత్రలో అక్షయ్ కుమార్
'మహాభారత' సిరీస్ని తెరకెక్కించిన ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథానాయికగా ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో పరమశివుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు భారీ బడ్జెట్. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం జరుపుతున్నారు.
మొదట ఈ చిత్రంలో ప్రభాస్-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని వార్తలు రాగా, తాజాగా కాజల్ పార్వతీదేవిగా నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Details
అధిక భాగం న్యూజిలాండ్ లో చిత్రీకరణ
మోహన్లాల్, శివరాజ్కుమార్, ఆర్.శరత్కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ అందిస్తున్నారు.
ఈ చిత్రంలోని అధిక భాగం న్యూజిలాండ్లో చిత్రీకరించారు. "ఈ చిత్ర కథ మూడో శతాబ్ద కాలంలో నాటిది.
ఆ కాలం ప్రకృతిని సక్రమంగా చూపించాల్సి ఉండడంతో, న్యూజిలాండ్లో చిత్రీకరణను చేపట్టామని చిత్రబృందం చెన్నైలో జరిగిన ప్రెస్మీట్లో తెలిపారు.