Page Loader
క్రిస్‌మస్‌ బరిలో సలార్.. ఈసారి షారుఖ్‌ ఖాన్‌తో పోటీ పడనున్న బాహుబలి 
ఈసారి షారుఖ్‌ ఖాన్‌తో పోటీ పడనున్న బాహుబలి

క్రిస్‌మస్‌ బరిలో సలార్.. ఈసారి షారుఖ్‌ ఖాన్‌తో పోటీ పడనున్న బాహుబలి 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 26, 2023
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ తాజా చిత్రం సలార్‌‌పై భారీ అంచనాలున్నాయి. ఈ మేరకు సినిమా రిలీజ్‌ డేట్‌లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి ఏకంగా షారుక్ ఖాన్ చిత్రం డుంకీతో పోటీ పడేందుకు సిద్ధమైంది. కెజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మెగా యాక్షన్ ఎంటర్‌‌ టైనర్‌‌ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. పాత షెడ్యూల్ మేరకు ఈ నెల 28న విడుదల అవ్వాలి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కారణంగా విడుదలను డిసెంబర్ నెలకు వాయిదా వేశారు. మరోవైపు సలార్‌‌ 2024 వేసవిలో వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ సినిమా క్రిస్‌మస్‌ బరిలో నిలవనున్నట్లు సమాచారం.

DETAILS

22న షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో 'డుంకీ

ఇదే క్రమంలో షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో 'డుంకీ' రిలీజ్ కానుంది. దీంతో సలార్ వర్సెస్ డుంకీ నడుమ బాక్సాఫిస్ వద్ద పోటీపడనున్నాయి. ఇప్పటికే పఠాన్, జవాన్‌ చిత్రాలతో గ్రాండ్ విక్టరీలు కొట్టేసిన షారుక్ జోరు మీదున్నారు. డిసెంబర్‌‌ 22న ప్రపంచ వ్యాప్తంగా సలార్‌‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈసారి డుంకీతో హ్యాట్రిక్‌ కొట్టేందుకు షారుక్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడు రాజ్‌ కుమార్ హిరాణీ దర్శకత్వంలో వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో సలార్‌ ఈ ఏడాది ఆఖరి నెల 22న పోటీ పడితే మాత్రం పెద్ద దెబ్బ పడటం ఖాయమని పరిశ్రమలో జోరుగా చర్చ జరుగుతోంది.