Prathinidhi 2: అవినీతి రాజకీయ నాయకులపై ఓ జర్నలిస్ట్ పోరాటం
నారా రోహిత్ 2014లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్' ప్రతినిధి'. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ప్రతినిధి- 2 టైటిల్ తో తాజాగా పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సీనియర్ జర్నలిస్ట్ , న్యూస్ రీడర్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. అంతకముందు ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చెయ్యగా ఈ రోజు టీజర్ రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ రోజు విడుదల చేసిన టీజర్ చూస్తే.. రాష్ట్ర అభివృద్ధి అలాగే రాష్ట్ర అప్పు లాంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది.
టీజర్ చివర్లో తూటాలా పేలిన నారా రోహిత్ డైలాగ్
టీజర్ చివర్లో "వచ్చి ఓటు వేయండి.. లేదా దేశం వదిలిపోండి.. లేకపోతే చచ్చిపోండి" అంటూ జర్నలిస్టుగా నారా రోహిత్ డైలాగ్ తూటాలల పేలాయి. సచిన్ ఖేడేకర్, జిషు సేన్గుప్తా, ఝాన్సీ,రఘుబాబు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కుమారరాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు.