LOADING...
Hina Khan: భారతదేశంలోని హిందువులందరికీ క్షమాపణలు: నటి హీనాఖాన్‌ పోస్ట్‌ వైరల్‌
భారతదేశంలోని హిందువులందరికీ క్షమాపణలు: నటి హీనాఖాన్‌ పోస్ట్‌ వైరల్‌

Hina Khan: భారతదేశంలోని హిందువులందరికీ క్షమాపణలు: నటి హీనాఖాన్‌ పోస్ట్‌ వైరల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 25, 2025
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన భీకర ఉగ్రదాడిపై ప్రముఖ నటి హీనా ఖాన్‌ స్పందిస్తూ, తన గుండెని కలచివేసిందని పేర్కొన్నారు. స్వయంగా కశ్మీర్‌కు చెందిన ఆమె, ఈ ఘటనను "ఒక చీకటి రోజు"గా అభివర్ణించారు. ఈ భయంకర ఘటనను ఖండిస్తూ, భారతదేశంలోని హిందువులందరికీ క్షమాపణలు తెలిపారు.

వివరాలు 

ఒక ముస్లింగా నేను ఈ ఘటనపై తీవ్రంగా బాధపడుతున్న 

"ఈ దాడిలో అమాయకుల ప్రాణాలు పోయాయి. వారికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఇది మానవత్వానికి మచ్చ కలిగించిన రోజు. మానవతా విలువలు పూర్తిగా విస్మరించి, స్వయాన్ని ముస్లింలమని చెప్పుకునే వారు, కనీసమైనా కారుణ్యం లేకుండా ఇలా కాల్పులు జరపడం తీరా భయానకంగా ఉంది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక ముస్లింగా నేను ఈ ఘటనపై తీవ్రంగా బాధపడుతున్నాను. అందుకే నా తోటి భారతీయులకు, దేశంలోని హిందువులందరికీ నిస్సంకోచంగా క్షమాపణలు చెబుతున్నాను. ఈ ఘటనలో మృతుల కుటుంబాల కోసం నా ప్రార్థనలు ఉంటాయి," అని హీనా ఖాన్ అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హీనా ఖాన్ చేసిన ట్వీట్ 

వివరాలు 

మతం లేదా కులం కంటే ముందుగా మనం అందరం భారతీయులం 

అంతేకాదు,కశ్మీర్‌ పరిస్థితుల గురించి మాట్లాడిన ఆమె,గతంతో పోలిస్తే ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎంతో మారాయని పేర్కొన్నారు. యువతలో భారతదేశంపై ఉన్న విశ్వాసం పెరుగుతోందని, ప్రజలు ఐక్యతతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మనమంతా కలసి భారతదేశానికి అండగా నిలవాలని కోరారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం తగదని, మతం లేదా కులం కంటే ముందుగా మనం అందరం భారతీయులమని గుర్తు చేశారు. ప్రస్తుతం హీనా ఖాన్‌ చేసిన ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. "అందరూ మీలా ఆలోచిస్తే దేశంలో ఎలాంటి అల్లర్లు ఉండవు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వివరాలు 

దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎక్కడ దొరికినా శిక్షిస్తాం: మోదీ 

ఇదిలా ఉండగా, ఈ దాడి పహల్గాం సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం అయిన బైసరన్‌ లోయలో చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో, సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు, పర్యాటకులపై తక్కువ దూరం నుంచే కాల్పులు జరిపారు. ఈ దాడిలో మొత్తం 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎక్కడ దొరికినా శిక్షిస్తామంటూ గట్టి హెచ్చరిక చేశారు.