Priyanka Chopra: రూ.16 కోట్ల విలువైన నాలుగు ఫ్లాట్లను అమ్మేసిన ప్రియాంక చోప్రా
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్ సినిమాలు, వెబ్సిరీస్లతో తీరిక లేకుండా ఉన్న ప్రముఖ నటి ప్రియాంక చోప్రా .
ప్రస్తుతం మహేష్ బాబు,రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న #SSMB29 లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్లో భాగంగా, ఆమె ఇటీవల కొంతకాలంగా ఇక్కడే ఉన్నారు.ఈ నేపథ్యంలో, ముంబయిలో ఆమెకు చెందిన కొన్ని విలాసవంతమైన ఫ్లాట్లు అమ్మినట్టుగా ఇండెక్స్ ట్యాప్ వెల్లడించింది.
వెస్ట్ ముంబయిలోని అంథేరీ ప్రాంతంలోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్లో ఉన్నఈ ఫ్లాట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
ప్రత్యేకించి, అవి అత్యంత ఖరీదైనవి కావడం విశేషం. ప్రియాంక చోప్రా ఈ ప్రాంతంలో నాలుగు ఫ్లాట్లను కలిగి ఉండగా,అందులో ఒకటి జోడీ యూనిట్గా ఉంది.
తాజా సమాచారం ప్రకారం,ఆమె ఈ మొత్తం ఆస్తులను రూ.16.17 కోట్లకు విక్రయించారు.
వివరాలు
మార్చి 3వ తేదీన లావాదేవీలు
18వ అంతస్తులో ఉన్న మూడు ఫ్లాట్లను వరుసగా రూ.3.45 కోట్లు, రూ.2.85 కోట్లు, రూ.3.52 కోట్లకు విక్రయించగా, 19వ అంతస్తులో ఉన్న జోడీ యూనిట్ ఒక్కటే రూ.6.35 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.
ఈ లావాదేవీలు మార్చి 3వ తేదీన పూర్తయ్యాయని సమాచారం. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా నివేదిక ప్రకారం, 2021లో ప్రియాంక వెర్సోవాలో రెండు ఆస్తులను, 2023లో లోఖండ్వాలాలో ఉన్న రెండు పెంట్హౌస్లను విక్రయించారు.
ప్రస్తుతం ఆమెకు గోవా, న్యూయార్క్, లాస్ ఏంజెలెస్లో వ్యక్తిగత సొంత గృహాలు ఉన్నాయి.
ఆమె భర్త నిక్ జోనస్, కుమార్తె మేరీ చోప్రా జోనస్తో కలిసి లాస్ ఏంజెలెస్లో నివసిస్తున్నారు.
వివరాలు
ప్రతినాయక ఛాయలతో కూడిన పాత్రలో ప్రియాంక
సినిమాల విషయానికొస్తే, ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్ట్లలో 'హెడ్స్ ఆఫ్ స్టేట్', 'ది బ్లఫ్' చిత్రాల్లో నటిస్తున్నారు.
అంతేకాకుండా, ఆమె 'సిటడెల్' అనే అమెరికన్ వెబ్సిరీస్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న #SSMB29 లో ప్రతినాయక ఛాయలతో కూడిన పాత్ర చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతానికి, ఈ చిత్ర షూటింగ్ ఒడిశాలో జరుగుతోంది. ఇందులో హీరో మహేశ్ బాబు పాత్ర పేరు 'రుద్ర' అని వార్తలు వినిపిస్తున్నాయి.