Padayappa re-release : రీ-రిలీజ్ హైప్ మధ్య రజనీకాంత్ సెన్సేషన్ అనౌన్స్మెంట్!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లోనే కాదు, మొత్తం దక్షిణాది సినీ చరిత్రలో అత్యంత భారీ బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది 'పడయప్ప' (తెలుగులో 'నరసింహ'). 1999లో విడుదలైన ఈ చిత్రంలో రజనీకాంత్ నటన ఎంత స్థాయిలో ప్రేక్షకులను అలరించిందో, రమ్యకృష్ణ అద్భుతంగా పోషించిన ప్రతినాయక పాత్ర 'నీలాంబరి' అంతే ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈ క్లాసిక్కు 25 ఏళ్లు పూర్తయ్యిన సందర్భంగా, రజనీకాంత్ జన్మదినం డిసెంబర్ 12న ప్రత్యేక రీ-రిలీజ్గా చిత్రం మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఈ రీ-రిలీజ్ ప్రమోషన్ల భాగంగా రజనీకాంత్ ఒక ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చేసిన ఒక కీలక వ్యాఖ్య ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
Details
పడయప్ప 2 గురించి చర్చలు జరుగుతున్నాయి
ఆయన అనూహ్యంగా 'పడయప్ప 2' (నరసింహ 2) గురించి ఆలోచనలు జరుగుతున్నాయని వెల్లడించడమే చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆశ్చర్యకరంగా—ఈ సీక్వెల్ పూర్తిగా రమ్యకృష్ణ పోషించిన ఐకానిక్ విలన్ పాత్ర నీలాంబరి చుట్టూ తిరుగుతుందని తెలిపారు. ఈ వ్యాఖ్యతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. అయితే వెంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇందులో కథనం ఎలా ఉంటుంది? అసలు 'పడయప్ప'లో నీలాంబరి చనిపోతుంది, మరి సీక్వెల్లో ఎలా తిరిగి తీసుకురానున్నారు?, ఇది ఫ్లాష్బ్యాక్ కథేనా? దర్శకత్వ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారన్నది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Details
రీ-రిలీజ్తో మరింత హైప్
ఇదిలా ఉండగా, ఒరిజినల్ చిత్ర దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ఇటీవలగా సినిమాల నుంచి దూరంగా ఉండటం వల్ల, ఇంత పెద్ద క్లాసిక్కు సీక్వెల్ తీసే సరైన దర్శకుడిని ఎంపిక చేయడం పెద్ద సవాలుగా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాక రజనీకాంత్ ఈ వ్యాఖ్యను కేవలం రీ-రిలీజ్కు మరింత హైప్ క్రియేట్ చేయడానికి చేసిన ప్లాన్గానే కొందరు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 'పడయప్ప' సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అందుబాటులో లేకపోవడంతో, దీన్ని మళ్లీ పెద్ద తెరపై చూడాలని అభిమానులు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ వ్యాఖ్య వెనుక నిజమైన ఉద్దేశ్యం ఏదైనా కావొచ్చు, కానీ వచ్చే డిసెంబర్ 12న థియేటర్లలో అభిమానులకో భారీ పండుగ ఖాయమే.