
Ram Charan Mumbai : సిద్ధి వినాయకుడి సన్నిధిలో రామ్ చరణ్.. లంబోదరుడికి ప్రత్యేక పూజలు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ మెగా హీరో రామ్చరణ్ ముంబై పర్యటనలో ఉన్నారు. బుధవారం ఉదయం ప్రసిద్ధి చెందిన సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా చరణ్కు ఆలయ పూజారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. తర్వాత శాలువాతో సత్కరించారు.
మరోవైపు చరణ్ తన కొత్త ఫ్రెండ్ (గుర్రం)ను పరిచయం చేశారు. ఇదే నా కొత్త ఫ్రెండ్ బ్లేజ్ అంటూ సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేశారు. ఈ క్రమంలోనే అశ్వం తలపై నిమురుతూ చరణ్ మెరిశారు.
మొదట్నుంచి హార్స్ రైడింగ్ అంటే చెర్రీకి చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే చరణ్ వద్ద కాజల్, బాద్ షా అనే రెండు గుర్రాలున్నాయి. తాజాగా ఆ లిస్టులోకి బ్లేజ్ వచ్చి చేరింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ముంబై సిద్ది వినాయకుడి సన్నిధిలో నటుడు రామ్ చరణ్
#WATCH | Maharashtra: Actor Ram Charan offered prayers at Siddhivinayak Temple in Mumbai.
— ANI (@ANI) October 4, 2023
(Source: Siddhivinayak Temple) pic.twitter.com/GEkTYIe9sf