Guntur Kaaram: గుంటూరు కారం నుండి నాలుగో లిరికల్ రిలీజ్.. మావా ఎంతైనా పర్లేదు బిల్లు
'సూపర్ స్టార్' మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల,మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్గా విడుదల కానుంది. గుంటూరు కారం సినిమా నుంచి తాజాగా ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. 'మావా ఎంతైనా పర్లేదు బిల్లు.. అంటూ మీనాక్షి చౌదరి, మహేష్ బాబులు సందడి చేశారు. ఈ పాటలో మహేష్ మాస్ స్టెపులతో అదరగొట్టాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శ్రీ కృష్ణ, రామాచారి కొమండూరి ఆలపించారు. థమన్ ఎస్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన కుర్చీ మడతపెట్టి సాంగ్ ట్రెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే.