బ్రో సినిమా సెట్స్ లోకి తిరిగివచ్చిన సాయి ధరమ్ తేజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర మోషన్ పోస్టర్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో సాయి ధరమ్ తేజ్ జాయినయ్యాడు. ఈ విషయాన్ని దర్శకుడు సముద్రఖని తన సోషల్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. విరూపాక్ష సినిమాతో తిరుగులేని సక్సెస్ సొంతం చేసుకుని ప్రస్తుతం బ్రో సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. బ్రో సినిమాలో బ్రహ్మానందం, సుబ్బరాజు, రోహిణి మొల్లేటి, తనికెళ్ళ భరణి నటిస్తున్నారు. జులై 28వ తేదీన బ్రో సినిమా థియేటర్లలోకి వస్తుంది.