మార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ తేజ్: బ్రో సినిమా నుండి లుక్ రిలీజ్
బ్రో సినిమా నుండి వరుసగా అప్డేట్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్ లుక్ ని రివీల్ చేసారు. మార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపిస్తారని చిన్నపాటి వీడియోను రిలీజ్ చేసారు. ఈ వీడియోలో, తెల్లని సూటు ధరించి సాయి ధరమ్ తేజ్ మెరిసిపోతున్నాడు. మార్కండేయులు పాత్రను అందరూ మార్క్ అని పిలుస్తారన్నట్టుగా ఈ వీడియోలో చూపించారు. పవన్ కళ్యాణ్ తో సాయి ధరమ్ తేజ్ కలిసిన నటిస్తున్న ఈ చిత్రాన్ని సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతమ్ చిత్రానికి రీమేక్ గా బ్రో రూపొందుతోంది.