Kannappa: 'కన్నప్ప' నుంచి 'శ్రీకాళహస్తి' ఫుల్ సాంగ్.. పాట పాడి అదరగొడుతున్న మంచు విష్ణు కుమార్తెలు
ఈ వార్తాకథనం ఏంటి
'కన్నప్ప' సినిమా కోసం ప్రమోషన్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో, కథానాయకుడు మంచు విష్ణు ఇటీవల అమెరికా పర్యటన చేపట్టి అక్కడ కొన్ని ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
తాజాగా బుధవారం "జనులారా వినరారా... కాళహస్తి గాథ, శ్రీకాళహస్తి గాథ... కనులారా మనసారా కనిన... జన్మ ధన్యమే కదా ఈ కథ" అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు.
శ్రీకాళహస్తి దేవాలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను ఈ పాటలో వివరించారు.
వివరాలు
కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేకంగా విడుదల
ఈ గీతాన్ని మోహన్ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా ఆలపించడం విశేషం.
పాటలో వారు తెరపై కూడా కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ప్రముఖ కవి సుద్దాల అశోక్తేజ్ ఈ గీతానికి సాహిత్యం అందించగా,సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని సమకూర్చారు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం,"ఈ గీతం శ్రీకాళహస్తి ఆలయ మహిమాన్వితను గొప్పగా ప్రతిబింబిస్తుంది. అద్వితీయ దృశ్యాలతో మైమరిపించేలా తీర్చిదిద్దారు. ఇది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునేలా ఉంటుంది" అని అభిప్రాయపడుతున్నారు.
ఈ పాటను కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేకంగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత మోహన్బాబు, దర్శకుడు ముకేశ్కుమార్ సింగ్, రచయితలు తోట ప్రసాద్, ఆకుల శివ, అర్పిత్ రాంకా తదితరులు హాజరై ఈ వేడుకను ప్రత్యేకంగా చేశారు.