NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / SSMB29: మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ప్రత్యేక తరగతులు.. ఎందుకో తెలుసా..?
    తదుపరి వార్తా కథనం
    SSMB29: మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ప్రత్యేక తరగతులు.. ఎందుకో తెలుసా..?
    మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ప్రత్యేక తరగతులు.. ఎందుకో తెలుసా..?

    SSMB29: మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ప్రత్యేక తరగతులు.. ఎందుకో తెలుసా..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 22, 2024
    04:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎస్‌.ఎస్.రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి రాబోతున్న చిత్రం ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB 29).

    గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి ప్రాంచైజీ, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో అంచనాలు ఊపందుకున్నాయి.

    ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

    ఈ సినిమా 2025లో సెట్స్‌పైకి రానున్న నేపథ్యంలో, ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది.

    ఎస్‌ఎస్ రాజమౌళి ఈ సినిమాకు మొదటిసారి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించబోతున్నట్లు సమాచారం.

    వివరాలు 

    ఏఐ టెక్నాలజీ ప్రత్యేక తరగతులకు  జక్కన్న 

    జక్కన్న సినిమా అంటే సాధారణంగా వీఎఫ్‌ఎక్స్ హైరేంజ్‌లో ఉంటుందన్న అందరికి తెలిసిందే.

    కానీ ఈ సారి ఏఐని విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, జక్కన్న ప్రత్యేక తరగతులకు కూడా హాజరవుతున్నాడట.

    సినిమాలోని కొన్ని పాత్రలు, జంతువులను సృష్టించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించబోతున్నాడని ఇన్‌సైడ్ టాక్.

    ఈ చిత్రంలో జక్కన్న ఎలా మ్యాజిక్ చేయబోతున్నాడో అన్నది అందరికి ఆసక్తి కలిగిస్తుంది.

    వివరాలు 

    2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల

    ఈ సినిమా ఒక ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా, ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్నది.

    ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్‌తో పాటు వివిధ భాషల నటీనటులు కనిపించబోతున్నారు.

    ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

    జక్కన్న టీం ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎస్.ఎస్.రాజమౌళి
    మహేష్ బాబు

    తాజా

    Israel : ఇజ్రాయెల్‌ దాడిలో వైద్యురాలితో సహా 9 మంది పిల్లల మృతి  ఇజ్రాయెల్
    Niti Aayog: 4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌ నీతి ఆయోగ్
    Ajit Agarkar: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు : అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ
    Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్‌! డొనాల్డ్ ట్రంప్

    ఎస్.ఎస్.రాజమౌళి

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. టాలీవుడ్
    చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'; 'నాటు నాటు' పాటను వరించిన ఆస్కార్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    Salaar: స‌లార్ ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన రాజమౌళి  సలార్
    S. S. Rajamouli: ఫ్లాప్ ఫేస్ చేయని ఒకే ఒక్క ఇండియన్ డైరెక్టర్‌‌.. ఈ డైరెక్టర్ గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు... రాజమౌళి

    మహేష్ బాబు

    షారుక్ ఖాన్ జవాన్ సినిమాపై మహేష్ బాబు ఆసక్తికరమైన పోస్ట్: కలిసి చూద్దామని రిప్లై ఇచ్చిన బాద్ షా  షారుక్ ఖాన్
    శ్రీమంతుడు యూట్యూబ్ వ్యూస్: మహేష్ బాబు నటించిన సినిమాకు తిరుగులేని రికార్డ్  తెలుగు సినిమా
    మరో యాడ్ షూట్ లో మహేష్ బాబు.. అదిరిన కొత్త లుక్  సినిమా
    సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన మామ మశ్చీంద్ర ట్రైలర్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025