Page Loader
Manchu Vishnu: మరో వివాదంలో మంచు ఫ్యామిలీ.. జంతువులను వేటాడిన కేసులో
మరో వివాదంలో మంచు ఫ్యామిలీ.. జంతువులను వేటాడిన కేసులో

Manchu Vishnu: మరో వివాదంలో మంచు ఫ్యామిలీ.. జంతువులను వేటాడిన కేసులో

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2024
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా మంచు కుటుంబం రెండు తెలుగు రాష్ట్రాలలో, అలాగే సినీ పరిశ్రమలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ విభేదాలతో రోడ్డెక్కిన మంచు ఫ్యామిలీ సభ్యులు, పోలీస్ స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మంచు మనోజ్ బలవంతంగా తన తండ్రి ఇంట్లోకి ప్రవేశించడంతో, మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేయడంతో, మనోజ్ ఇంట్లో విష్ణు కరెంట్ నిలిపివేయడం వంటి అంశాలతో, మంచు కుటుంబం దాదాపు పది రోజులపాటు మీడియాలో టాపిక్‌గా నిలిచింది. అయితే, మోహన్ బాబు కుటుంబ వివాదం సద్దుమణిగినట్లు అనిపించిన వేళ, మరొకసారి మంచు కుటుంబం వార్తల్లోకి వచ్చింది. ఈ సారి, కుటుంబ వివాదం కాకుండా, జంతువులను వేటాడిన కేసులో కీలకంగా నిలిచింది.

వివరాలు 

వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

హైదరాబాద్ శివారులోని జల్ పల్లిలోని అటవీ ప్రాంతంలో మంచు విష్ణు సిబ్బంది జంతువులను వేటాడినట్లు సమాచారం. మంచు విష్ణు మేనేజర్ కిరణ్ అడవి పందులను వేటాడాడు. ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ వేటాడిన పందిని బంధించి తీసుకువెళ్లాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడిన విషయంపై మంచు మనోజ్ అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని ఆయన మేనేజర్, ఎలక్ట్రిషన్‌లకు హెచ్చరించినప్పటికీ, వారు వినకుండా వేట కొనసాగించారు. ఈ ఘటనపై నెటిజన్లు జంతువులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.