LOADING...
Khusbu: పక్కా ప్రణాళిక ప్రకారమే ఆ ఘటన.. కరూర్ తొక్కిసలాటపై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు
పక్కా ప్రణాళిక ప్రకారమే ఆ ఘటన.. కరూర్ తొక్కిసలాటపై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

Khusbu: పక్కా ప్రణాళిక ప్రకారమే ఆ ఘటన.. కరూర్ తొక్కిసలాటపై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ (Vijay) ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై నటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్‌ (Khusbu Sundar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన పక్కాగా ప్రణాళికాబద్ధంగా, కొందరు ఉద్దేశపూర్వకంగా సృష్టించినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం సరైన ర్యాలీ స్థలం ఇవ్వకపోవడం దీనికి ప్రధాన కారణమని ఖుష్బూ పేర్కొన్నారు. తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె గుర్తుచేశారు. దీనిపై మౌనంగా ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించాల్సిన అవసరం ఉందని ఖుష్బూ సూచించారు.

Details

నిజాలు ప్రజలకు తెలియాలి

అదేవిధంగా ర్యాలీ సందర్భంగా పోలీసులు ఎందుకు లాఠీ చార్జ్‌ చేశారన్న విషయంపై ఆమె ప్రశ్నించారు. ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు బయటకు వచ్చినందున, ఈ ఘటనలో నిజానికి ఏమ జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాజాగా కరూర్‌లో జరిగిన ఈ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయి, అనేక మంది గాయపడ్డారు. పోలీసులు ఇప్పటికే కొన్ని బాధ్యులను అరెస్ట్‌ చేశారు. మరిన్ని దర్యాప్తుల కోసం మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల మేరకు సిట్‌ విచారణ కూడా ప్రారంభించారు.