The Kerala Story: ఓటీటీలో రికార్డు వ్యూస్తో అలరిస్తున్న 'ది కేరళ స్టోరీ'
రెండు సంవత్సరాల క్రితం దేశాన్ని ఓ ఊపు ఊపిన చిత్రం'ది కేరళ స్టోరీ'. వివాదాస్పద ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. చాలాకాలం నిరీక్షణల తర్వాత చివరకు ఫిబ్రవరి 16, 2024న ZEE5లోప్రసారం అయ్యింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటిటిలో కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రం ZEE5 ప్లాట్ఫారమ్లో,కేవలం 3 రోజుల్లోనే 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించి, ఒక మైలురాయిని సాధించింది. అదా శర్మతో పాటు, ఈ చిత్రంలో యోగితా బిహానీ, సోనియా బలానీ,సిద్ధి ఇద్నానీ,దేవదర్శిని, విజయ్ కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్షైన్ పిక్చర్స్పై విపుల్ అమృత్లాల్ షా నిర్మించిన ఈ చిత్రానికి విశాఖ జ్యోతి,వీరేష్ శ్రీవల్స సంగీతాన్ని అందించారు.