
Vijay -Rashmika: మరోసారి కెమెరాకు చిక్కిన విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న.. ఈసారి ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా పరిశ్రమలో కొన్ని జంటలు తెరపై చూపించే కెమిస్ట్రీతోనే కాకుండా తెరవెనుక ఉన్న సంబంధాలతోనూ ప్రేక్షకులలో భారీ ఆసక్తిని కలిగిస్తుంటాయి.
అలాంటి ఒక హాట్ టాపిక్ జంటగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నిలిచారు.
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాల ద్వారా ఈ జంట తెరపై అలరించగా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు పుకార్లు వ్యాపిస్తున్నా, వారు ప్రతిసారి అది కేవలం మంచి స్నేహమేనని స్పష్టం చేస్తూ వచ్చారు.
అయితే తాజాగా మరోసారి ఈ జంట హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో రష్మిక మందన్నా కారులోకి ఎక్కిన అనంతరం, విజయ్ దేవరకొండ అదే కారులో ముందు సీట్లో కనిపించడం కెమెరాలకు చిక్కింది.
Details
సోషల్ మీడియాలో ఫోటోలు షేర్
ఈ దృశ్యం క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరి బాండింగ్ను చూసిన అభిమానులు ''ఇదే జోడీ కావాలి'' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
నిజానికి, ఈ జంటకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అమోఘం. ప్రస్తుతం ఈ జంట కెరీర్ పరంగానూ బిజీగా ఉంది.
రష్మిక మందన్నా బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో తన స్థిరత్వాన్ని పెంచుకుంటుండగా, విజయ్ దేవరకొండ టాలీవుడ్లో తన మాస్ ఇమేజ్ను మరింత బలోపేతం చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
వీరి కలిసి కనిపించడం వల్ల మరోసారి వీరి వ్యక్తిగత సంబంధంపై చర్చలు మళ్లీ చెలరేగాయి.