వరుణ్-లావణ్య పెళ్లి కోసం ఇటలీకి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజ్నెవా శనివారం ఇటలీకి బయలుదేరారు. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో గల బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్లో వరుణ్, లావణ్య పెళ్లి జరగనుంది. అక్టోబర్ 22న లావణ్య-వరుణ్ టుస్కానీకి వెళ్లిపోయారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని పలువురు ఇటలీకి చేరుకున్నారు. మిగతా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా రిసార్ట్కు పయనమవుతున్నారు. హల్దీ, మెహందీ, సంగీత్, వివాహం అంటూ నాలుగు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9 న హైదరాబాద్లో కుటుంబ సభ్యుల సమక్షలో జరిగిన విషయం తెలిసిందే.