NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే
    హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే

    Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 24, 2025
    08:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ప్రకటించిన ప్రయాణ ఛార్జీలపై 10 శాతం రాయితీ ఈ శనివారం నుంచి అమల్లోకి రానుందని ఎల్‌అండ్‌టీ సంస్థ శుక్రవారం ప్రకటించింది.

    తాజా ఛార్జీల పెంపు నేపథ్యంలో, దూరాన్ని బట్టి ప్రయాణ ఛార్జీలు ఎంతగా ఉంటాయన్న విషయాన్ని వివరిస్తూ సంస్థ ధరల పట్టికను విడుదల చేసింది.

    గతంలో కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కి పెరిగిన విషయం తెలిసిందే.

    ఇప్పుడు 10 శాతం రాయితీ అనంతరం కనీస ఛార్జీ రూ.11, గరిష్ఠ ఛార్జీ రూ.69గా ఉంటుందని సంస్థ పేర్కొంది. ఇది ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఇచ్చిన సడలింపు అని వెల్లడించింది.

    Details

    కొన్ని ఫేర్ జోన్లలో రాయితీలు ఇవ్వలేదని విమర్శలు

    క్యూఆర్‌ కోడ్ టికెట్లు, కాగితపు టికెట్లు, టోకెన్లు, డిజిటల్‌ టికెట్లు, స్మార్ట్‌కార్డులు తదితర అన్ని రకాల టికెట్లపై ఈ రాయితీ వర్తించనుంది. సంస్థ విడుదల చేసిన ధరల పట్టికను పరిశీలిస్తే 'ఇదేంటీ రాయితీ'? అనే ప్రశ్నలు ప్రయాణికుల నుంచి రావడం మొదలైంది.

    కొన్ని ఫేర్ జోన్లలో వాస్తవానికి 10 శాతం రాయితీ కూడా ఇవ్వలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    ఉదాహరణకి, 24 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరానికి గరిష్ఠ ఛార్జీ రూ.75 అయితే, 10 శాతం తగ్గింపుతో అది రూ.67.5 కావాలి. కానీ పట్టికలో మాత్రం రూ.69గా చూపించారు.

    Details

    ప్రయాణికుల్లో అంసతృప్తి

    2, 4 కిలోమీటర్ల ఫేర్ జోన్లు తప్ప మిగతా అన్ని జోన్లలో కూడా రాయితీ శాతం పదికి తక్కువగా ఉంది.

    ఇంకొక ఉదాహరణగా, 18 కిలోమీటర్లకు పైగా ప్రయాణానికి తాజా ఛార్జీ రూ.60 కాగా, 10 శాతం తగ్గిస్తే అది రూ.54 అవ్వాలి. కానీ సంస్థ రూ.56గా పేర్కొంది.

    సమీప ఛార్జీకి సర్దుబాటు చేశారన్న అర్థమూ లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    రాయితీ పేరిట విడుదల చేసిన ఈ తాజా ధరల పట్టికలో అసలైన తగ్గింపు ఉందా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రయాణికులలో మరింత పెరుగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    ఇండియా

    తాజా

    Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే హైదరాబాద్
    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు

    హైదరాబాద్

    Hyderabad : హైదరాబాద్‌ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు గోవా
    HCU: హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం తెలంగాణ
    Koheda: కొహెడలో అతిపెద్ద పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి రంగం సిద్ధం.. 199 ఎకరాలు.. రూ.1,901 కోట్లు.. భారతదేశం
    Polavaram: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ పోలవరం

    ఇండియా

    Indian Railways: తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం తిరుపతి
    Telangana: కంచ గచ్చిబౌలి భూ వివాదం.. హెచ్‌సీయూకు కేంద్ర సాధికారిక కమిటీ విచారణ తెలంగాణ
    Special Trains: వేసవి రద్దీకి ముందస్తు ఏర్పాట్లు.. తిరుపతికి 14 ప్రత్యేక రైళ్లు తిరుపతి
    Haryana: హాస్టల్‌లో కలకలం.. సూట్‌కేసులో గర్ల్‌ఫ్రెండ్‌ను దాచిన యువకుడు (వీడియో) హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025