NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి
    మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. 10 మంది మృతి

    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 15, 2025
    09:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో పది మంది మిలిటెంట్లు మృతి చెందారు.

    చందేల్ జిల్లాలో అసోం రైఫిల్స్ బలగాలు, మిలిటెంట్ల మధ్య తీవ్రంగా కాల్పులు జరగాయని భద్రతా శాఖ వెల్లడించింది.

    ఈ ఘర్షణలో హతమయ్యినవారు మావోయిస్టులేనని సమాచారం. భారత సైన్యం ప్రకారం, భారత్-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న న్యూ సమ్తాల్ గ్రామం వద్ద ఆయుధాలతో సంచరిస్తున్న మిలిటెంట్ల కదలికలపై నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి.

    దీంతో స్పియర్ కార్ప్స్‌కు చెందిన అసోం రైఫిల్స్ యూనిట్ మే 14, 2025న ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది.

    వివరాలు 

    పది మంది మిలిటెంట్లు మృతి

    ఈ ఎన్‌కౌంటర్‌పై ఈస్ట్ కమాండ్ అధికారికంగా తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ,''చందేల్ జిల్లాలోని ఖెంగ్‌జాయ్ తేహ్సీల్ పరిధిలో ఉన్న న్యూ సమ్తాల్ గ్రామం సమీపంలో మిలిటెంట్ల కదలికలపై నిఘా సమాచారాన్ని ఆధారంగా చేసుకొని అసోం రైఫిల్స్ బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి'' అని పేర్కొంది.

    ఆపరేషన్ జరుగుతున్న సమయంలో మిలిటెంట్లు భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు.

    దాంతో జవాన్లు తక్షణమే ఎదురుకాల్పులు ప్రారంభించి వ్యూహాత్మకంగా తిరిగి చర్యలు చేపట్టారు.

    ఈ కాల్పుల్లో మొత్తం పది మంది మిలిటెంట్లు మృతిచెందినట్లు ఆర్మీ తెలిపింది.

    సంఘటనా స్థలంలో పెద్దఎత్తున ఆయుధాలు,తూటాలు భద్రతా బలగాల చేతిలో పట్టుబడ్డాయి.

    హతమైన మిలిటెంట్ల వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

    ప్రస్తుతం ఈఘటన కొనసాగుతున్న ఆపరేషన్‌లో భాగంగా చోటుచేసుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్

    తాజా

    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి మణిపూర్
    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    మణిపూర్

    Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి  భారతదేశం
    Manipur: మణిపూర్ లో మరోసారి హింస..ముగ్గురు మృతి..30మందికి పైగా గాయాలు  భారతదేశం
    Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి  తాజా వార్తలు
    Manipur: మణిపూర్ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసిన 200 మంది సాయుధులు ఇంఫాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025