Page Loader
జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి 
జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి

జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి 

వ్రాసిన వారు Stalin
May 30, 2023
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం కత్రా వెళ్తున్న బస్సు లోయలో దూసుకెళ్లింది. ప్రమాదంలో 10మంది మృతి చెందగా, 20మంది గాయపడ్డారు. ఝజ్జర్ కోట్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జమ్మూలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ట్రాక్టర్ లోయలో పడిన ఒక రోజు(సోమవారం) తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు సహా ఎనిమిది మంది మృతి చెందగా, మరో 26మంది గాయపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదం జరిగిన ప్రదేశంలోని దృశ్యాలు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సహాయక చర్యలు