
11 years of NDA: ఎన్డీయే ప్రభుత్వానికి నిన్నటితో 11 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటితో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ 11 ఏళ్ల పాలన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
"గత దశాబ్దంలో ఎన్డీయే ప్రభుత్వం పేదరికం బారి నుంచి అనేక మందిని బయటకు తీసుకురావడానికి విస్తృతమైన పథకాలను అమలు చేసింది. సాధికారత,మౌలిక సదుపాయాలు, సమగ్రతపై దృష్టి సారించింది.మా అన్ని కీలక పథకాలు పేదల జీవితాలను మార్చివేశాయి. పీఎం ఆవాస్ యోజన,పీఎం ఉజ్జ్వల యోజన,జన్ ధన్ యోజన,ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు గృహనిర్మాణం,శుభ్రమైన వంట ఇంధనం,బ్యాంకింగ్ సేవలు,ఆరోగ్య సంరక్షణకు ప్రజలకు సులభ ప్రాప్యత కల్పించాయి.
వివరాలు
25 కోట్లకు పైగా ప్రజలు పేదరికాన్ని జయించారు
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి), డిజిటల్ సమగ్రత, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి తద్వారా పారదర్శకంగా చివరి వ్యక్తి వరకు ప్రయోజనాలు వేగంగా చేరేలా చేశారు.
దీని ఫలితంగా 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికాన్ని జయించారు.
ఎన్డీయే ప్రభుత్వం ప్రతి పౌరుడికి గౌరవపూర్వక జీవన ప్రమాణాలు కలిగిన సమగ్ర, స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంది." అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
Our Government’s efforts towards all round development have led to transformative outcomes and benefitted the poor and marginalised. #11YearsOfGaribKalyan https://t.co/Ub2ZGJAZ1F
— Narendra Modi (@narendramodi) June 5, 2025
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
बीते 11 साल में हमारी सरकार का हर कदम सेवा, सुशासन और गरीब कल्याण को समर्पित रहा है। इस दौरान हमारी उपलब्धियां ना सिर्फ अभूतपूर्व हैं, बल्कि 140 करोड़ देशवासियों के जीवन को आसान बनाने वाली हैं। मुझे पूरा विश्वास है कि देश को आगे ले जाने के अपने इन प्रयासों के साथ हम विकसित और… pic.twitter.com/rz9vQ76y7l
— Narendra Modi (@narendramodi) June 5, 2025