ఒడిశాలో పెండ్లి బస్సు- ఆర్టీసీ బస్సు ఢీ; 12మంది దుర్మరణం
ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(ఓఎస్ఆర్టీసీ) బస్సు- పెళ్లి బృందంతో వస్తున్న ప్రైవేట్ బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. గంజాం జిల్లాలోని దిగపహండి పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున 1గంటకు జరిగిన ఈ ప్రమాదంలో 12మంది మరణించారు. ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో 10మంది మృతి చందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మరణించారు. దీంతో మొత్తం మృతు సంఖ్య 12కి చేరుకుంది. ఓఎస్ఆర్టీసీ బస్సు రాయగడ నుంచి భువనేశ్వర్కు వెళుతుండగా, ప్రైవేట్ బస్సు బెర్హంపూర్ జిల్లాలోని ఖండదేవులి గ్రామం నుంచి పెళ్లి బృందంతో తిరిగి వస్తోందని బెర్హంపూర్ ఎస్పీ శరవణ వివేక్ తెలిపారు.
బస్సు ప్రమాదంపై సీఎం నవీన్ పట్నాయక్ దిగ్బ్రాంతి
బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు క్షతగాత్రులకు అన్ని విధాలా సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని దివ్య జ్యోతి పరిదా చెప్పారు. మరణించిన వారిలో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎంకేసీజీ మెడికల్ కాలేజీకి తరలించినట్లు గంజాం జిల్లా మేజిస్ట్రేట్ దివ్య జ్యోతి పరిదా తెలిపారు. బస్సు ప్రమాదంలో పదిమంది మృతి చెందడం పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.