NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mumbai: ముంబై పర్యాటక పడవ బోల్తా.. 13 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    Mumbai: ముంబై పర్యాటక పడవ బోల్తా.. 13 మంది మృతి 

    Mumbai: ముంబై పర్యాటక పడవ బోల్తా.. 13 మంది మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 19, 2024
    08:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబై తీరంలో బుధవారం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ఉన్న నీల్‌కమల్ పడవ నేవీ స్పీడ్ బోట్ ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది.

    ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 110మందికిపైగా ప్రయాణికులు ఉండగా,ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

    దాదాపు 101మందిని రక్షించినట్లు సమాచారం.ప్రస్తుతం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 3:55 గంటలకు బుచార్ ద్వీపం సమీపంలో నేవీ బోట్ ఢీకొనడంతో నీల్‌కమల్ పడవ బోల్తా పడింది.

    రాత్రి 7:30 గంటల వరకు అందిన వివరాల ప్రకారం, 13 మంది మరణించగా, 10 మంది పౌరులు మరియు ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారు.

    వివరాలు 

    సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5 లక్షలు

    సీఎం ఫడ్నవిస్ ప్రకటించిన ప్రకారం, ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5 లక్షలు అందజేస్తారు.

    నీల్‌కమల్ పడవ, ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఎలిఫెంటా ద్వీపానికి ప్రయాణీకులను తీసుకెళ్తుండగా, నేవీ స్పీడ్ బోట్ అదుపు తప్పి ఢీకొట్టింది.

    కొత్త ఇంజిన్ పరీక్షించడంలో బోట్ నియంత్రణ కోల్పోయినట్లు నివేదికలు వెల్లడించాయి.

    ప్రమాద ప్రాంతంలో 11 నేవీ బోట్లు, మూడు మెరైన్ పోలీసు బోట్లు, కోస్ట్ గార్డ్ బోట్‌లు మోహరించబడగా, నాలుగు హెలికాప్టర్లు రంగంలోకి దించారు.

    స్థానిక మత్స్యకారులు కూడా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను గురువారం వెల్లడించనున్నట్లు సీఎం తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై

    తాజా

    CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ  చంద్రబాబు నాయుడు
    Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    Kavitha: 'భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు'.. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్‌కు కవిత లేఖ!  కల్వకుంట్ల కవిత
    Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా యోచన బంగ్లాదేశ్

    ముంబై

    Raveena Tandon: రవీనా టాండన్‌పై ముంబై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు  సినిమా
    Salman Khan Female Fan Arrest: సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో మహిళా అభిమాని హంగామా.. అరెస్ట్ చేసిన పోలీసులు  సల్మాన్ ఖాన్
    Mumbai's coastal road trip wonders: ముంబై కోస్తా తీరం సొగసు చూడతరమా..  లైఫ్-స్టైల్
    Ice cream: నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకోగానే ఖంగుతున్న లేడీ.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025