NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 50 అడుగుల గోతిలో పడిన బస్సు .. 15 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 50 అడుగుల గోతిలో పడిన బస్సు .. 15 మంది మృతి 
    ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 50 అడుగుల గోతిలో పడిన బస్సు

    Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 50 అడుగుల గోతిలో పడిన బస్సు .. 15 మంది మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 10, 2024
    08:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి ఉద్యోగులతో నిండిన బస్సు 50 అడుగుల లోతైన గోతిలో పడిపోయింది.

    ఈ ప్రమాదంలో 15 మంది ఉద్యోగులు మరణించగా, 16 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే కుమ్హారి పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

    జిల్లా ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం రాయ్‌పూర్ ఎయిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు సీఎం విష్ణు దేవ్‌సాయి ఆదేశాలు జారీ చేశారు.

    Details 

    కేడియా డిస్టిలరీ ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం 

    దుర్గ్ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కంటోన్మెంట్ ఏరియా) హరీష్ పాటిల్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కుమ్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

    ఉద్యోగులు కెడియా డిస్టిలరీ కంపెనీకి చెందిన ఉద్యోగులుగా చెబుతున్నారు. ఈ ఉద్యోగులు డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు.

    కేడియా డిస్టిలరీ మృతులపై ఆధారపడిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

    ప్రమాదంలో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    Details 

    మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశం 

    ప్రమాదం జరిగిన ప్రదేశంలో మురుము గనులు ఉన్నాయని చెబుతున్నారు. బస్సులో లైట్లు వెలగలేదని కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

    ఈ కారణంగా బస్సు జారి కాలువలో పడిపోయింది. ప్రమాదంపై డిప్యూటీ సీఎం విజయ్ శర్మ విచారణకు ఆదేశించారు.

    విచారణలో నిర్లక్ష్యం ఎవరిది అని తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    ఉప ముఖ్యమంత్రి శర్మ రాయ్‌పూర్ ఎయిమ్స్‌కు చేరుకుని క్షతగాత్రుల పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. దుర్గ్ కలెక్టర్ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    50 అడుగుల లోతైన గోతిలో పడిన బస్సు 

    #WATCH | Chhattisgarh: 11 people have been killed and several others are injured after a bus full of workers overturned in a mine in Durg. The process of evacuating the people trapped in the bus is underway. Further details awaited: Police pic.twitter.com/0zfOphjhtI

    — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 9, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛత్తీస్‌గఢ్
    ఛత్తీస్‌గఢ్‌

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఛత్తీస్‌గఢ్

    కాంగ్రెస్ ప్లీనరీలో రోశయ్య, జైపాల్‌రెడ్డికి సంతాపం; రెండో‌రోజు సెషన్‌కు సోనియా, రాహుల్ హాజరు కాంగ్రెస్
    Congress Plenary: పొలిటికల్ రిటైర్మెంట్‌పై సోనియా కీలక ప్రకటన; బీజేపీ పాలనపై ఫైర్ కాంగ్రెస్
    Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్

    ఛత్తీస్‌గఢ్‌

    ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్నికల వేళ డిప్యూటీ సీఎంగా టీఎస్‌ సింగ్‌ నియామకం   ఛత్తీస్‌గఢ్
    కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం; ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘటన ఛత్తీస్‌గఢ్
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ కురువృద్ధుడు, మాజీ మంత్రి లీలారామ్ భోజ్వానీ కన్నుమూత ఛత్తీస్‌గఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025