NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 1984 Anti Sikh Riots: హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    1984 Anti Sikh Riots: హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష 
    హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష

    1984 Anti Sikh Riots: హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 25, 2025
    03:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌ (Sajjan Kumar) తండ్రీకొడుకులను సజీవదహనం చేసిన కేసులో జీవితఖైదు పడింది.

    ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ఆయనకు ఈ శిక్షను విధిస్తూ తీర్పు ప్రకటించింది.

    ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ కావేరీ బవేజా (Justice Kaveri Baweja) సజ్జన్‌ కుమార్‌కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు స్పష్టం చేశారు.

    ఇప్పటికే 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన మరో కేసులో సజ్జన్‌ కుమార్‌ జీవితఖైదు అనుభవిస్తున్నారు.

    అదే అల్లర్ల సమయంలో,1984 నవంబర్‌ 1న ఢిల్లీలోని సరస్వతి నగర్‌లో సిక్కు మతానికి చెందిన తండ్రీకొడుకులను అల్లరి మూక సజీవదహనం చేసింది.

    వివరాలు 

    సిక్కులపై దాడులు

    ఈ కేసులో కూడా నిందితుడిగా ఉన్న సజ్జన్‌ కుమార్‌ను ఈ నెల 12న కోర్టు దోషిగా తేల్చగా, నేడు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.

    1984 అక్టోబర్‌ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా సిక్కులపై దాడులు ప్రారంభమయ్యాయి.

    అదే క్రమంలో నవంబర్‌ 1న ఢిల్లీలో తండ్రీకొడుకులైన జశ్వంత్‌ సింగ్‌, తరుణ్‌దీప్‌ సింగ్‌ ఇంటిపై అల్లరి మూక దాడి చేసింది.

    వారు ఇంటిని ధ్వంసం చేసి, ఆపై నిప్పంటించి తండ్రీకొడుకులను సజీవదహనం చేసింది. ఈ ఘటనపై జశ్వంత్‌ సింగ్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.

    వివరాలు 

    అల్లరి మూకకు నాయకత్వం వహించిన సజ్జన్‌ కుమార్‌

    సజ్జన్‌ కుమార్‌ ఈ దాడిలో కేవలం ఒక సాధారణ సభ్యుడిగా కాకుండా, ప్రధానంగా అల్లరి మూకకు నాయకత్వం వహించినట్లు కోర్టు తీర్పులో పేర్కొంది.

    న్యాయమూర్తి కావేరీ బవేజా వ్యాఖ్యానిస్తూ, అతడు చేసిన నేరానికి గరిష్ఠ శిక్షగా మరణదండన విధించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, తీహార్ జైల్లో అతని ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని జీవిత ఖైదు విధిస్తున్నామని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    దిల్లీ

    Delhi Exit Polls: దిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ? భారతదేశం
    Delhi Exit Polls: దిల్లీలో బీజేపీకే అధికారం.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలివే! భారతదేశం
    Delhi: మరికొన్ని గంటల్లో ఫలితం.. దిల్లీ విజేత ఎవరు?  కాంగ్రెస్
    Delhi:దిల్లీ పీఠం ఎవరిది? మొదలైన కౌంటింగ్‌ బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025