దేశంలో కొత్త్గగా 2,961 కేసులు; 17 మరణాలు
దేశంలో గత 24గంటల్లో 2,961 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిపి మొత్తం యాక్టివ్ కేసులు సంఖ్య 30,041కి చేరింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4కోట్లకు చేరుకుంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.07 శాతంగా ఉన్నాయి. దేశంలో కరోనాతో కొత్తగా 17మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య సంఖ్య 5,31,659కి పెరిగింది.