NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Haryana: హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు
    తదుపరి వార్తా కథనం
    Haryana: హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు
    హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు

    Haryana: హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 09, 2024
    04:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానాలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారి విజయం సాధించింది. కమలం పార్టీ 48 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్‌ 37 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

    ఈ నేపథ్యంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు కూడా కమలం పార్టీకే మద్దతు ప్రకటించారు.

    హర్యానాలో విజయం సాధించిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో భారత్‌లో సంపన్న మహిళా నేత సావిత్రి జిందాల్‌ ఉన్నారు.

    ఆమెతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన దేవేందర్‌ కడ్యాన్‌, రాజేశ్‌ జూన్‌ బీజేపీ అధినాయకత్వంతో భేటీ అయ్యారు.

    రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ధర్మేంద్ర ప్రధాన్‌ నివాసంలో కడ్యాన్‌ , రాజేశ్‌ జూన్‌ ఆ పార్టీలో చేరారు. సావిత్రి జిందాల్‌ కూడా ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు.

    వివరాలు 

    సావిత్రి జిందాల్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం

    సావిత్రి జిందాల్‌ గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2005, 2009లో హిస్సార్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

    ఈ ఎన్నికల్లో ఆమె బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ ఆ పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

    తాజా బీజేపీ రికార్డు విజయంతో, తిరిగి ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    మరో స్వతంత్ర ఎమ్మెల్యే కడ్యాన్‌ కూడా బీజేపీ రెబల్‌గా పోటీ చేసి గనౌర్‌ నుంచి గెలుపొందారు. రాజేశ్‌ జూన్‌ బహదూర్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా
    బీజేపీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    హర్యానా

    Dilli Chalo:'డిల్లీ చలో' మార్చ్‌లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు: హర్యానా పోలీసులు  భారతదేశం
    Farmers protest: 'దిల్లీ మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా.. నేడు సరిహద్దులో కొవ్వొత్తల ర్యాలీ దిల్లీ
    Nafe Singh Rathi: హర్యానాలో మాజీ ఎమ్మెల్యే దారుణ హత్య.. కారుపై బుల్లెట్ల వర్షం  ఇండియన్ నేషనల్ లోక్ దళ్/ ఐఎన్‌ఎల్‌డీ
    Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్  ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    బీజేపీ

    BJP Candidates List: రాయ్‌బరేలీ-కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థుల ఖరారు ఉత్తర్‌ప్రదేశ్
    No funds-puri MP candidate-Sucharitha Mohanthy: డబ్బుల్లేవు ....పోటీ చేయలేనని ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుచరిత మహంతి ఒడిశా
    Upadesh Rana-Rajasingh-Abubakar-Surat Police: రాజాసింగ్ తో సహా ఇద్దరు హిందూ నేతల హత్యకు సుపారి ...నిందితుడి అరెస్ట్ సూరత్
    Bjp-Bengal-TMC-SandeshKhali: బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ ల మాటలయుద్ధం పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025