NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: రాజధానిలో 31 సంస్థలకు భూకేటాయింపుల కొనసాగింపు.. 13 సంస్థలకు రద్దు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Amaravati: రాజధానిలో 31 సంస్థలకు భూకేటాయింపుల కొనసాగింపు.. 13 సంస్థలకు రద్దు
    రాజధానిలో 31 సంస్థలకు భూకేటాయింపుల కొనసాగింపు.. 13 సంస్థలకు రద్దు

    Amaravati: రాజధానిలో 31 సంస్థలకు భూకేటాయింపుల కొనసాగింపు.. 13 సంస్థలకు రద్దు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 13, 2025
    10:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజధాని అమరావతిలో గతంలో 31 సంస్థలకు కేటాయించిన 629.36 ఎకరాల భూమిని యథావిధిగా కొనసాగించాలని, మరో 13 సంస్థలకు కేటాయించిన 177.24 ఎకరాల భూమిని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

    భూమి కేటాయింపులు కొనసాగుతున్న సంస్థలకు నిర్మాణ గడువును అదనంగా రెండేళ్లు పెంచింది.

    2014 నుండి 2019 మధ్య కాలంలో అమరావతిలో జరిగిన భూ కేటాయింపులను ప్రభుత్వం సమీక్షిస్తోంది.

    ఈ మేరకు, కొత్త భూ కేటాయింపుల పరిశీలనతో పాటు, గత కేటాయింపుల సమీక్ష కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

    వివరాలు 

    69 ప్రభుత్వ సంస్థలు, 61 ప్రైవేటు సంస్థలు

    ఇప్పటికే మూడు సమావేశాలు నిర్వహించిన ఉపసంఘం, గతంలో భూమిని పొందిన 13 సంస్థలకు కేటాయింపులను రద్దు చేయాలని, మరో 31 సంస్థలకు కొనసాగించాలని నిర్ణయించింది.

    ఈ నిర్ణయానికి మంత్రివర్గ సమావేశం మార్చి 17న ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 2014-19 మధ్య మొత్తం 130 సంస్థలకు 1277.68 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

    వీటిలో 69 ప్రభుత్వ సంస్థలు, 61 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. భూకేటాయింపులను కొనసాగించనున్న 31 సంస్థలను మూడు విభాగాలుగా విభజించారు.

    అప్పట్లో రాజధానిలో రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఒకదానికి 5 ఎకరాలు, మరొకదానికి 8 ఎకరాలు కేటాయించారు.

    మొత్తం భూమిని 60 ఏళ్ల పాటు లీజుకు ఒక్క రూపాయికే కేటాయించాలని ప్రతిపాదించారు.

    వివరాలు 

    11 సంస్థలతో త్వరలో ఒప్పందం 

    తాజా సమావేశంలో ఒక కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు.

    దీనిని మొదటి విభాగంలో చేర్చి, సీఆర్‌డీఏ కమిషనర్ సవరించిన లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్ జారీ చేయనున్నారు.

    భూమి కేటాయింపులను కొనసాగించనున్న సంస్థల్లో 11 సంస్థలు ఇప్పటి వరకు సీఆర్‌డీఏతో విక్రయ లేదా లీజు ఒప్పందాలు చేసుకోలేదు.

    వీటికి త్వరలో లెటర్‌ ఆఫ్‌ ఇన్విటేషన్‌ జారీ చేయనున్నారు. ఈ లేఖ అందుకున్న 30 రోజుల్లోగా సంబంధిత ఒప్పందాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

    ఈ జాబితాలో తితిదేకు కేటాయించిన 25 ఎకరాల భూమిలో ఆలయ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.

    వివరాలు 

    భూమి కేటాయింపులు రద్దైన సంస్థలు 

    రాజధానిలో భూమిని పొందినా, నిర్మాణ పనులు ప్రారంభించని లేదా ఆసక్తి కనబరచని 13 సంస్థలకు భూకేటాయింపులను రద్దు చేశారు.

    వీటిలో బీఆర్‌ఎస్‌ మెడిసిటీ, ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఐయూఐహెచ్‌) సంస్థలు ప్రాజెక్టుల్ని ప్రారంభించకపోవడం, అనేక మార్లు లేఖలు పంపినా స్పందించకపోవడంతో, 2019కి ముందే అప్పటి తెదేపా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

    ఆంధ్రా బ్యాంక్, సిండికేట్‌ బ్యాంకులు విలీనమైనందున, వాటికి కేటాయించిన భూమిని రద్దు చేశారు.

    వివరాలు 

    19 సంస్థలకు గడువు పొడిగింపు 

    ఇప్పటికే విక్రయ లేదా లీజు ఒప్పందాలు చేసుకున్న 19 సంస్థలకు ప్రాజెక్టుల అమలు గడువును 2027 మార్చి 31 వరకు పొడిగించాలని నిర్ణయించారు.

    వీటిలో ఎస్‌ఆర్‌ఎం, విట్, అమృత యూనివర్సిటీలు ఇప్పటికే నిర్మాణ పనులను పూర్తి చేశాయి.

    ఎస్‌ఆర్‌ఎం, విట్‌లలో ఇంజినీరింగ్, పీజీ కోర్సులు పూర్తయి, కొన్ని బ్యాచ్‌లు ఇప్పటికే విద్యాభ్యాసాన్ని ముగించాయి.

    ఎన్‌ఐడీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్) నిర్మాణం కూడా ఎక్కువ శాతం పూర్తయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి

    తాజా

    Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు అమరావతి
    Ola Roadster X: ఓలా రోడ్‌స్టర్ ఎక్స్.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రేంజ్ ఓలా
    WhatsApp: వాట్సాప్ స్టేటస్‌లో నాలుగు సరికొత్త ఫీచర్లు.. యూజర్లకు మరింత సౌకర్యం! వాట్సాప్
    Bandi Sanjay: 'కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామానే'.. బండి సంజయ్ ఫైర్ బండి సంజయ్

    అమరావతి

    Amaravati: రాజధాని అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రుణం.. నవంబరులో నిర్మాణ పనుల ప్రారంభం ప్రపంచ బ్యాంకు
    Andhrapradesh: రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ భారతదేశం
    Amaravati: అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు ఆంధ్రప్రదేశ్
    Chandra babu: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025