NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..బహుళ వాహనాలు ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..బహుళ వాహనాలు ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు 
    తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..బహుళ వాహనాలు ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు

    Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..బహుళ వాహనాలు ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 25, 2024
    04:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా తోప్పూర్ ఘాట్ రోడ్డు వద్ద బుధవారం ఓ వంతెనపై బహుళ వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

    చికిత్స నిమిత్తం వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

    తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

    సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యిన దృశ్యాలలో వేగంగా దూసుకొస్తున్న ఓ ట్రక్కు ఎదురుగా వస్తున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది.

    ఈ ధాటికి రెండు ట్రక్కుల మధ్య చిక్కుకున్న కారు నుజ్జునుజ్జు కాగా, మరో వాహనం అదుపు తప్పి వంతెనపై నుంచి పడిపోయింది.

    Details 

    పెండింగ్‌లో ఉన్న ఎలివేటెడ్ నేషనల్ హైవే పనులు 

    ఇంతలోనే ఓ ట్రక్కులో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

    ఈ ప్రమాదంపై ధర్మపురి డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ స్పందిస్తూ.. పెండింగ్‌లో ఉన్న ఎలివేటెడ్ నేషనల్ హైవే పనులను పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

    ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయన్న భయంతోనే తాము ధర్మపురిలోని తోప్పూర్ ఘాట్ సెక్షన్ వద్ద మంజూరైన ఎలివేటెడ్ హైవేని సత్వరమే అమలు చేయాలని పట్టుబడుతున్నామని ఆయన అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    తమిళనాడు

    Tamilnadu: కొత్త కూటమి ఏర్పాటు చేస్తాం.. అన్నామలైని తొలగించమని అడగలేదు: ఏఐఏడీఎంకే భారతదేశం
    TamilNadu Mobile Blast: వేర్వేరు చోట్ల పేలిన సెల్ ఫోన్లు.. అక్కడికక్కడే మహిళా మృతి  మహిళ
    మరో వివాదంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. మహిళా రిపోర్టర్‌ పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు  బీజేపీ
    తమిళనాడు: విరుదునగర్‌లోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు.. 11 మంది మృతి   భారతదేశం

    రోడ్డు ప్రమాదం

    గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 10 మందికి గాయాలు  గుజరాత్
    లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. దొంగను పోలీసులు వెంటాడుతుండగా తెలుగు విద్యార్థి మృతి  లండన్
    Karnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు  కర్ణాటక
    రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. ఆరుగురు దుర్మరణం.. 20మందికి పైగా! మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025