NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..  రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మృతి  
    తదుపరి వార్తా కథనం
    UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..  రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మృతి  
    రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మృతి

    UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..  రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మృతి  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 10, 2024
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అమ్రోహా జిల్లాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మరణించారు.

    ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. మృతులను లక్కీ, సల్మాన్, షారుక్, షానవాజ్‌లుగా గుర్తించారు.

    ఈ నలుగురు యువకులు యూట్యూబ్‌లో రౌండ్ 2 వరల్డ్ ఛానెల్ కోసం కామెడీ కంటెంట్‌ను రూపొందింస్తున్నట్లు సమాచారం.

    వివరాలు 

    4 యూట్యూబర్‌ల మరణం 

    యూట్యూబ్‌లు పుట్టినరోజు వేడుకల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, వారి కారు ఎదురుగా వస్తున్న బొలెరో కారును ఢీకొట్టినట్లు సమాచారం.

    ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా అక్కడ జనం గుమిగూడారు. వాహనాలు అతి వేగంగా ఢీకొన్నాయి.

    ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి వారు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

    సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని సిహెచ్‌సి గజ్రౌలా ఆసుపత్రికి తరలించేందుకు వెంటనే అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.

    అయితే ప్రాథమిక చికిత్స చేసేలోపే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

    వివరాలు 

     పుట్టినరోజు కార్యక్రమాలు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. 

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూట్యూబర్‌లు పుట్టినరోజు కార్యక్రమాలు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో కారు ఢీకొట్టింది.

    ప్రమాదం జరిగిన తర్వాత జనం గుమిగూడారు. ప్రమాదం జరిగిన తర్వాత యువకులను గజ్రౌలా సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు.

    ఇక్కడ ప్రాథమిక చికిత్స సమయంలో, వారు చనిపోయినట్లు డాక్టర్ ప్రకటించారు.

    వివరాలు 

    ప్రమాదంపై దర్యాప్తు  

    క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమ్రోహా జిల్లా ఆసుపత్రికి తరలించామని, మృతులను పోస్ట్‌మార్టం కోసం పంపామని పోలీసు అధికారి తెలిపారు.

    మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని, ప్రమాద స్థలాన్ని సీనియర్ అధికారులు పరిశీలించారని తెలిపారు. నలుగురు యువకుల కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్

    ఉత్తర్‌ప్రదేశ్

    Uttarpradesh: లక్నో సమీపంలో సిలిండర్ పేలుడు.. ఐదుగురి మృతి  భారతదేశం
    Pramod Yadav: దుండగుల కాల్పుల్లో బీజేపీ నేత ప్రమోద్ యాదవ్ మృతి  భారతదేశం
    Uttarpradesh : యూపీలో భూ వివాదం.. ఓబీసీ నేత గొంతు కోసి హత్య  హత్య
    CM YOGI: 'డీప్‌ఫేక్' బారిన పడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. వీడియో వైరల్ యోగి ఆదిత్యనాథ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025